నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 01 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో జరుగుతున్న ఎన్నికల ఓటర్ల జాబితా ప్రక్రియ ఈనెల 14వ తేదీ కి పూర్తి కావాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాధవ కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం ఆయన తాసిల్దార్ శ్రీనివాసులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ బూతు లెవల్ ఆఫీసర్లు, పెండింగ్ లో ఉన్న ఎన్నుమరేషన్ పత్రాల పంపిణీ తక్షణమే 100% పూర్తి చేయాలని పంపిణీ తో పాటు డిజిటైజేషన్ పనులను కూడా రోజువారి లక్షలతో వేగవంతం చేసి గణనీయమైన పురోగతి సాధించాలని సూచించారు. ఎన్నుమరేషన్ పత్రాలను పూర్తి చేయడంలో బూతులు ఆఫీసర్లు సహకరించాలన్నారు. ప్రతిబిఎల్వోలు తన పరిధిలోని పనులను పూర్తి బాధ్యతతో ఎలాంటి జాప్యం లేకుండా నిర్వహించాలని, నిరంతరం ఫీల్డ్ లో ఉండి ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తూ ఎనుమరేషన్ పత్రాల పంపిణీ మరియు డిజిటైజేషన్ పనులను సమాంతరంగా పూర్తి చేయాలని సూచించారు
Reporter
Namitha News