Sunday, 13 September 2026 09:57:45 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

విద్యా నాణ్యతలో మరో మైలురాయి – మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ

మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి బి.టెక్ మరియు ఇతర కోర్సు లకు ప్రవేశాలు ప్రారంభం

Date : 01 July 2026 06:36 PM Views : 133

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 01 : మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి బి.టెక్ మరియు ఇతర కోర్సు లకు ప్రవేశాలు ప్రారంభం మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాలు ప్రారంభమైనట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అనుసంధానమైన బోధన, ఉత్తమ ప్లేస్‌మెంట్ అవకాశాలతో మిట్స్ దేశంలో గుర్తింపు పొందిన ప్రముఖ విద్యాసంస్థగా కొనసాగుతోందని పేర్కొన్నారు. యూనివర్సిటీలో బీటెక్, ఎం.టెక్, బీబీఏ, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ మరియు పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి అని ఆయన అన్నారు. ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు 100% వరకు స్కాలర్‌షిప్‌లు, అర్హతకు అనుగుణంగా ఫీజు రాయితీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. గత మూడు సంవత్సరాల్లో 5,895 ప్లేస్‌మెంట్ ఆఫర్లు లభించగా, 3,854 మంది విద్యార్థులు ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని, ఇటీవల సి.ఎస్.ఈ విద్యార్థిని టి.ఆర్. దీక్ష అమెజాన్‌లో రూ.29.53 లక్షల వార్షిక వేతన ప్యాకేజీతో ఉద్యోగం సాధించడం విశేషమని పేర్కొన్నారు. ఈ అకాడమిక్ ఇయర్ కు బీటెక్ నందు సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్,మెకానికల్ ఇంజినీరింగ్, బయోఇన్ఫర్మాటిక్స్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్(ఏఐ మరియు రోబోటిక్స్) ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ (ఏఐ మరియు డేటా సైన్స్), కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్(ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్), కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ (సైబర్ సెక్యూరిటీ) లకు ప్రవేశాలు ప్రారంభం అయ్యాయని ఆయన అన్నారు. ఇతర కోర్సులు బీబీఏ మరియు బీసీఏ లు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలు (MoUs), ఇంటర్న్‌షిప్‌లు, విదేశీ విద్య అవకాశాలు, ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధనకు అనుకూల వాతావరణం మిట్స్ ప్రత్యేకతలని తెలిపారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సుల్లేర్ మాట్లాడుతూ మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థలలో ఒకటిగా తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటూ విద్యా రంగంలో విశిష్ట సేవలను అందిస్తోంది అని, 1998లో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం, గత 28 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య, పరిశోధన, ఆవిష్కరణలు మరియు పరిశ్రమల అనుసంధానంతో విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో తీర్చిదిద్దుతోంది అని అన్నారు. విశ్వవిద్యాలయం స్థాపకులు మరియు ఛాన్సలర్ డా. ఎన్. విజయభాస్కర్ చౌదరి దూరదృష్టి, సమర్థవంతమైన నాయకత్వంలో మిట్స్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ విద్యాసంస్థగా ఎదిగింది అని అన్నారు. 27 ఎకరాల విస్తీర్ణంలో సుందరమైన ప్రకృతి వాతావరణంలో విస్తరించి ఉన్న ఈ విశ్వవిద్యాలయం అత్యాధునిక ప్రయోగశాలలు, పరిశోధన కేంద్రాలు, డిజిటల్ తరగతి గదులు మరియు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కలిగి ఉందిఅని, మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఏఐసీటీఈ (AICTE) – అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, న్యూ ఢిల్లీ ఆమోదం, న్యాక్ (NAAC) "A+" గ్రేడ్ గుర్తింపు, జాతీయ అక్రెడిటేషన్ మండలి (ఎన్‌బీఏ) (NBA) గుర్తింపు, యూజిసి2(ఎఫ్) మరియు 12(బి)(UGC 2(f) & 12(B)) గుర్తింపు, యెన్.ఐ ఆర్. ఎఫ్ (NIRF) ర్యాంకింగ్, ఐ ఎస్ ఓ (ISO) 21001:2018 సర్టిఫికేషన్, అలాగే ఏ.ఐ.యూ (AIU) మరియు సి.ఐ.యూ (CIU) సభ్యత్వాలను పొందడం ద్వారా తన విద్యా నాణ్యతను మరింత బలపరుచుకుంది అని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమలతో అనుసంధానం, అంతర్జాతీయ అవకాశాలు, ఉపాధి దిశగా ప్రత్యేక శిక్షణ అందిస్తూ దేశ విదేశాల్లో ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సాధించేలా మిట్స్ నిరంతరం కృషి చేస్తోంది. మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉండి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ భారతదేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలలో ఒకటిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది అని అన్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కొనసాగుతున్నాయని, అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా అడ్మిషన్ పోస్టర్ ను యూనివర్సిటీ ప్రాంగణం లో ఆవిష్కారించారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డాక్టర్ పీ రామనాథన్, ప్లేసెమెంట్ ఆఫీసర్ ద్రుపద్ వర్మ తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :