Monday, 20 April 2026 02:29:38 PM
# జనసేన అధినేత త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసైనికుడు రాయల్ కుమార్ # జాతీయ స్థాయీ టెక్నికల్ సింపోసియం ప్రతిభ కనబర్చిన మిట్స్ విద్యార్థులు # పోలీసులు చేసిన సేవ అభినందనీయం - యస్.ఐ. అనిల్ కుమార్ # అభివృద్ధి పనులతో కోసువారిపల్లి పరుగులు - బేరిపల్లి శ్రీనివాసులు # ముగిసిన క్రీడాభారతి అన్నమయ్య జిల్లా కబడ్డీ పోటీలు -- విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీల ప్రదానం # యువత అంబేడ్కర్ మార్గంలో నడవాలి -- బాస్ యువజన విభాగం పిలుపు # యువత అంబేడ్కర్ మార్గంలో నడవాలి -- బాస్ యువజన విభాగం పిలుపు # అమ్మ చెరువు మిట్ట వద్ద రోడ్డు ప్రమాదం, తండ్రీ బిడ్డ మృతి # మిట్స్ లో ఘనంగా అన్యూవల్ డే # నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్దేశకులు # మహిళా బిల్లు ఆమోదం పొందలేకపోవడం దురదృష్టకరం # ఉపాధి హామీ పనుల వేగం పెంచండి - డ్వామా పిడి వెంకటరత్నం # ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అనిల్ చంద్ర పునేఠా # రెవెన్యూ సేవల్లో వేగం పెంచాలి –జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # జడ్పి ఉన్నత పాఠశాల లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ # మిట్స్ విద్యార్థుల ఇండస్ట్రీ విజిట్ # గ్రామీణ ఉపాథి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర - సీపీఐ # మదనపల్లి - చెంబకూరు మార్గం పెంచుపాడు సమీపంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్.టి.సి. బస్సు # ఎద్దులవారికోట అంగన్వాడీ లో పోషణ పక్వాడ # బైరెడ్డిపల్లి డిప్యూటీ ఎంపీడీవో గా బాలకృష్ణ నాయక్

దళిత డప్పు కళాకారులపై దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్

Date : 17 April 2026 07:53 PM Views : 44

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : దళిత డప్పు కళాకారులపై దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్ చట్టం ముందు అందరూ సమానమే – అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరిక అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వేంపల్లి గ్రామంలో దళిత డప్పు కళాకారులపై జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ నెల 12న చెన్నకేశవ స్వామి ఊరేగింపు సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై అందిన ఫిర్యాదును సుమోటోగా స్వీకరించిన ఎస్సీ కమిషన్, నేడు గ్రామంలో పర్యటించి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కమిషన్ త్రీమెన్ కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీపతి బాబు, మేకల బిక్షం, పి. గౌతమ్ రాజ్ గ్రామ సచివాలయంలో గ్రామస్తులను, బాధిత డప్పు కళాకారులను విచారించి వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. అనంతరం మదనపల్లి రూరల్ సీఐ కళా వెంకటరమణ, ఎస్సై రామకృష్ణారెడ్డి లను కూడా ప్రశ్నించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు మాట్లాడుతూ, గ్రామస్తుల ఆహ్వానం మేరకు జాతరకు వచ్చి జీవనోపాధి కోసం డప్పులు వాయిస్తున్న దళిత కళాకారులపై ఎస్సై దాడి చేయడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. గ్రామంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య ప్రదర్శన జరుగుతున్న సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారులు ఈ విధంగా ప్రవర్తించడం ఆందోళనకరమన్నారు. వివక్ష రహిత సమాజ నిర్మాణమే ఎస్సీ కమిషన్ లక్ష్యమని, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, అధికారులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలని సూచించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదికను ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి దామోదర్ రెడ్డి, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు, పసల చంద్రశేఖర్, రామకృష్ణ, ఆర్‌ఐ బాలసుబ్రహ్మణ్యం, ఏఎస్‌డబ్ల్యూఓ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :