Thursday, 30 July 2026 12:27:03 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

దళిత డప్పు కళాకారులపై దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్

Date : 17 April 2026 07:53 PM Views : 251

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : దళిత డప్పు కళాకారులపై దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్ చట్టం ముందు అందరూ సమానమే – అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరిక అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వేంపల్లి గ్రామంలో దళిత డప్పు కళాకారులపై జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ నెల 12న చెన్నకేశవ స్వామి ఊరేగింపు సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై అందిన ఫిర్యాదును సుమోటోగా స్వీకరించిన ఎస్సీ కమిషన్, నేడు గ్రామంలో పర్యటించి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కమిషన్ త్రీమెన్ కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీపతి బాబు, మేకల బిక్షం, పి. గౌతమ్ రాజ్ గ్రామ సచివాలయంలో గ్రామస్తులను, బాధిత డప్పు కళాకారులను విచారించి వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. అనంతరం మదనపల్లి రూరల్ సీఐ కళా వెంకటరమణ, ఎస్సై రామకృష్ణారెడ్డి లను కూడా ప్రశ్నించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు మాట్లాడుతూ, గ్రామస్తుల ఆహ్వానం మేరకు జాతరకు వచ్చి జీవనోపాధి కోసం డప్పులు వాయిస్తున్న దళిత కళాకారులపై ఎస్సై దాడి చేయడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. గ్రామంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య ప్రదర్శన జరుగుతున్న సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారులు ఈ విధంగా ప్రవర్తించడం ఆందోళనకరమన్నారు. వివక్ష రహిత సమాజ నిర్మాణమే ఎస్సీ కమిషన్ లక్ష్యమని, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, అధికారులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలని సూచించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదికను ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి దామోదర్ రెడ్డి, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు, పసల చంద్రశేఖర్, రామకృష్ణ, ఆర్‌ఐ బాలసుబ్రహ్మణ్యం, ఏఎస్‌డబ్ల్యూఓ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :