నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూలై 25 : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా జనరల్ బాడీ సమావేశం నిన్నటి రోజున నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు ఆమోదించడం జరిగింది అనంతరం అన్నమయ్య జిల్లా నూతన సమితిని కౌన్సిల్ ను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఆవుల శేఖర్ గారు ప్రకటించారు తీర్మానాలు ఆగస్టు ఆరవ తేదీ నుంచి 16వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాలలో చేతి నిండా పనులు కల్పించి వలసలు ఆకలి చావులు ఆత్మహత్యలు నివారించాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ జిల్లాలో ప్రధానంగా అన్నమయ్య జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యుద్ధ ప్రాతిపదికన పనులు వేగవంతం చేయాలని రేషన్ షాపులు ద్వారా నిత్యవసర సరుకులు అయిన ఉప్పు పప్పు బియ్యము వంట నూనెలు మిగతా నిత్యవసర వస్తువులు 20 రకాల వస్తువులను చౌక్ దుకాణాలు ద్వారా పంపిణీ చేయాలని ఆగస్టు 21వ తేదీన అన్ని మండల కార్యాలయం వద్ద వ్యవసాయ కూలీలకు దళిత గిరిజనులకు నిరుపేదలకు ప్రభుత్వం మిగులు భూములు పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీల మేరకు గ్రామాలలో రెండు మూడు సెంట్లు ఇంటి స్థలం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం స్టీలు సిమెంటు ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని రాష్ట్రంలో కోనే రంగారావు భూ కమిటీ సిఫారసులను అమలు చేయాలని ప్రభుత్వం మిగులు భూములు వ్యవసాయ కూలీలకు సన్నకారు చిన్న కారు రైతులకు పంపిణీ చేయకుండా బడా కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా రెడ్ కార్పెట్టేసి 99 పైసలకు ఎకరా భూమి ఇవ్వడానికి ప్రభుత్వం పూనుకోవడం తద్వారా కంపెనీలు నెలకొల్పకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన వ్యవసాయ కూలీలు వ్యతిరేక విధానాలు రైతాంగ వ్యతిరేక విధానాలు సామాన్య పేద వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్లకు పేదల జోబులు కొట్టి పంచి పెడుతున్న విధానాలు నిరసిస్తూ సెప్టెంబర్ ఒకటవ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అలాగే ఈ రాష్ట్రంలో భూదందాలు భూ బకాసురులు ప్రభుత్వ భూములు కబ్జాదార కూరల్లో కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా పంచ పెట్టడాన్ని నిరసిస్తూ పేదలకు ప్రభుత్వ భూములు పంపిణీ చేయాలని ఇండ్ల స్థలాలు పెన్షన్లు తదితర సమస్యలపై అక్టోబర్ రెండవ వారంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాన్ని గ్రామ మండల నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేసి పేదలు ను ఐక్యం చేసి చైతన్యవంతం చేసి ప్రజా పోరాటాలకు సిద్ధం చేయడానికి సంఘం పూనుకోవాలని వారు పిలుపునిచ్చారు అనంతరం అనంతరం అన్నమయ్య జిల్లా నూతన కౌన్సిల్ ను ఎన్నుకోవడం జరిగింది 29 మంది తో కౌన్సిల్ ను ఎన్నుకోవడం జరిగింది అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా సిద్ధిగాళ్ళ శ్రీనివాసులు రాయచోటి నియోజకవర్గంఉపాధ్యక్షులుగా జి శంకర తంబాలపల్లి నియోజకవర్గం ఉమా రామ్మూర్తి జిల్లా ప్రధాన కార్యదర్శిగా తోపు కృష్ణప్ప సహాయ కార్యదర్శులుగా ఎల్ ముండ్రత్నం నాయుడు రెడ్డప్ప భాస్కర కోశాధికారిగా జి నారాయణస్వామి తో పాటు 29 మంది నూతన కౌన్సిల్ ను ఎన్నుకోవడం జరిగింది
Reporter
Namitha News