Monday, 14 September 2026 08:54:27 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మసీదు కమిటీకి వక్ఫ్ బోర్డు భూములకు సంబంధం లేదు

వక్ఫ్ బోర్డు భూములపై రాజకీయం చేయడం తగదు - భూమి వారసులు

Date : 23 December 2025 08:03 AM Views : 191

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె కదిరి రోడ్డులోని వక్ఫ్ బోర్డు భూములకు జామియా మసీదు కమిటీ పెద్దలకు ఎలాంటి సంబంధం లేదని బాధితులు నూర్జహాన్ బేగం, శవాల్ బేగం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోమవారం వారు తమ స్వగృహం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం అవుతున్నట్లు మసీదు పెద్దలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అయితే వక్ఫ్ బోర్డు భూములు పూర్వీకుల నుంచి తమకు సంక్రమించాయని, ఇందులో ఎలాంటి కబ్జాలు లేవన్నారు. గత ప్రభుత్వాలు వక్ఫ్ బోర్డు చట్టప్రకారం సగం భూమి వక్ఫ్ బోర్డుకు, మిగతా సగం భూమి తమ పూర్వీకులకు కేటాయించారన్నారు. అయితే వక్ఫ్ బోర్డు భూముల వివాదం తెరపైకి రావడంతో కోర్టులో కేసు వేశామన్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోందని అక్కడే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా న్యాయస్థానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. వక్ఫ్ బోర్డు భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోని కమిటీ పెద్దలు భూముల అన్యాక్రాంతంపై చర్చకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. వక్ఫ్ బోర్డు భూముల అన్యాక్రాంతం, దురాక్రమణ, ఇతర అంశాలపై కోర్టులో కేసు వేశామని వివరించారు. కోర్టు కేసుపై ఎవరూ జోక్యం చేసుకోకూడదన్నారు. న్యాయస్థానం తీర్పుకు అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. అయితే ఈ భూములకు కమిటీ పెద్దలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వక్ఫ్ బోర్డు భూములపై రాజకీయం చేయడం తగదన్నారు. కమిటీ పెద్దలు రాజకీయ కోణంలో ఆలోచిస్తూ వక్ఫ్ బోర్డు భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది తమ పూర్వీకులు కొనుక్కున్న భూమని వారినుండీ సంక్రమించిన ఈ భూమికి తామే వారసులమన్నారు. ఈ భూమితో కమిటీ పెద్దలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అనవసరంగా జోక్యం చేసుకుని రాజకీయ రంగు పులిమారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: