నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు - గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంతకుమారి వెల్లడి - పలు పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన,చిత్రలేఖనం పోటీలు మదనపల్లె : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంతకుమారి పేర్కొన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం గ్రంథాలయాల ప్రాముఖ్యత అనే అంశంపై వ్యాసరచన,చిత్రలేఖనం పోటీలను బాపూజీ మున్సిపల్ హైస్కూల్,బూన్ హైస్కూల్,జిల్లా పరిషత్ స్కూల్,జి.ఆర్.టి ఇంగ్లీష్ మీడియం స్కూల్,జ్ఞానోదయ స్కూల్ విద్యార్థులకు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంత కుమారి మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయన్నారు.ప్రతిరోజు వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.అదేవిధంగా వ్యాసరచన,చిత్రలేఖనం పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు నేడు అనగా బుధవారం జరుగబోవు మహిళా దినోత్సవం కార్యక్రమంలో బూన్ స్కూల్,బాపూజీ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయబడునన్నారు.మిగిలిన పాఠశాలల పిల్లలకు వారోత్సవాల ముగింపు రోజైన ఈనెల 20వ తేదీన బహుమతులు ప్రదానం చేయబడునన్నారు.ఈ కార్యక్రమంలో బూన్ హైస్కూల్ కరస్పాండెంట్ శంకర్,హెచ్.ఎం రమాదేవి,ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,విద్యార్తినీ,విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Reporter
Namitha News