Monday, 08 June 2026 09:51:48 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమం ఉధృతం

Date : 12 November 2025 08:45 PM Views : 279

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 12 : రాష్ట్రం లోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం చేయాలని చూస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని తంబళ్లపల్లె ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చౌడేశ్వర లు హెచ్చరించారు. బుధవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాల మేరకు తంబళ్లపల్లి వైయస్సార్ సర్కిల్ నుండి వందలాదిమంది వైకాపా నాయకులు, కార్యకర్తలు ఊరేగింపు గా పాత బస్టాండు, పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేసే అంశాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలతో డివిజన్ నుండి జిల్లాస్థాయి రాష్ట్ర స్థాయి వరకు నిరసనలు చేపట్టి అడ్డుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా కూటం ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై కార్యకర్తలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి నాయకత్వాలు వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గం లోని మండల స్థాయి వైకాపా నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, వైయస్సార్ అభిమానులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :