నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 12 : రాష్ట్రం లోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం చేయాలని చూస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని తంబళ్లపల్లె ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చౌడేశ్వర లు హెచ్చరించారు. బుధవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాల మేరకు తంబళ్లపల్లి వైయస్సార్ సర్కిల్ నుండి వందలాదిమంది వైకాపా నాయకులు, కార్యకర్తలు ఊరేగింపు గా పాత బస్టాండు, పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేసే అంశాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలతో డివిజన్ నుండి జిల్లాస్థాయి రాష్ట్ర స్థాయి వరకు నిరసనలు చేపట్టి అడ్డుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా కూటం ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై కార్యకర్తలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి నాయకత్వాలు వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గం లోని మండల స్థాయి వైకాపా నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, వైయస్సార్ అభిమానులు పాల్గొన్నారు.
Reporter
Namitha News