నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 11 : మదనపల్లె పరిసర ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండీ లక్ష రూపాయలు విలువచేసే 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు
గతంలో నమోదైన ఉల్లిపాయల లోడ్ కింద భారీ ఎత్తున గంజాయిని తరలిస్తున్న 179 కేజీల గంజాయి స్మగ్లింగ్ కేసు పాత కేసులో పరారీలో ఉన్న నలుగురు ముద్దాయిలను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఈ నిందితులను శనివారం బసినికొండ పంచాయతీ పరిధిలో తనిఖీల సమయంలో పుంగనూరు వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు దిగి నల్లటి కవర్లతో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకోగా వీరు పాత కేసులో నిందితులుగా గుర్తించి రిమాండ్కు తరలిస్తున్నట్లు గా వివరిస్తూ పట్టుబడిన ముద్దాయిలు శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలానికి చెందిన మల్లెల మహేష్, మల్లెల అమరావతితో పాటు, పుంగనూరు పట్టణానికి చెందిన మల్లెల రాజమ్మ, మల్లెల చంటి లు, వీరి వద్ద నున్న 4 కేజీ ల గంజాయి ని కూడా స్వాధీనం చేసుకొన్నట్లు వెల్లడించిన అదనపు ఎస్పీ వెంకటాద్రి
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాల మీద ఉక్కుపాదం మోపుతున్నాం. ముఖ్యంగా యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచాం, గంజాయి విక్రేతలపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తాం అని హెచ్చరిస్తూ జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు
Reporter
Namitha News