నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 01: తంబళ్ల పల్లె నియోజకవర్గ కేంద్రం లో దశాబ్దాలు గా ప్రాంతాలలో సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యలను తంబళ్లపల్లె టిడిపి నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలపై తీవ్రంగా స్పందించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నితీష్ కుమార్,పి.డి వెంకటరత్నం ఆదేశాలతో రూ కోటి తో ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తంబళ్లపల్లెలోని శ్రీనివాస కాలనీ, ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు విస్తరణ,కాలనీ, మసీదు వీధి, కృష్ణానగర్, కోర్టువీధి లలో యుద్ధ ప్రాతిపదికన సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణాల పనులు వేగం పుంజుకున్నాయని అదేవిధంగా సాలెవీదిలో త్వరలో సిసి రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడతామని కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి విలేకరులకు తెలిపారు. దశాబ్దాల కల నెరవేరడంతో స్థానిక ప్రజలు కూటమి ప్రభుత్వంతో పాటు జిల్లా కలెక్టర్, పీ.డి, పంచాయతీరాజ్ అధికారులు, టిడిపి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు
Reporter
Namitha News