నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 16 ః తంబళ్లపల్లె ఐ సి డి ఎస్ పరిధిలోని అంగన్వాడీ సెంటర్లలో మాతా శిశు సంక్షేమం పోర్షన్ పక్వాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిడిపిఓ సుజాత పిలుపునిచ్చారు. గురువారం ఐసిడిఎస్ కార్యాలయ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 9వ తేదీ నుండి ప్రారంభమైన పోషణ పక్వాడ కార్యక్రమం ఈనెల 23వ తేదీ ముగుస్తుందన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమం లో తల్లి మరియు శిశు పోషణ, మెదడు అభివృద్ధికి ప్రారంభ దశ, ఆట ఆధారిత విద్య, తల్లిదండ్రులు మరియు సహజ పాత్ర అంటే స్క్రీనింగ్ టైమింగ్ పిల్లలు మొబైల్, టీవీలకు అట్రాక్ట్ గా అవ్వకుండా, అంగన్వాడీల కోసం సమాజ మద్దతు సమీకరణ, తల్లిదండ్రుల ప్రోత్సాహం కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ సహజ సిద్ధ వంట పాత్రలతో వంటలు చేయడంతో పాటు జింక్ ఫుడ్ పిల్లలకి హానికరమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాదియా,ఫోర్డ్ నరసింహులు, సూపర్ వైజర్ రమణమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News