నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అమరావతి - మే 08 : రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అమరావతి లో 7వ ఉన్నతస్థాయి సదస్సు పాల్గొన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ లు ఇతర ఉన్నత అధికారులు. శుక్రవారం రెండో రోజు జరిగిన ఈ కీలక సమావేశానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ , జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్త అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలు, మరియు శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులకు పలు కీలక సూచనలు, దిశానిర్దేశం చేశారు. ఈ సదస్సులో భాగంగా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాల పురోగతి, అలాగే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తీసుకుంటున్న పటిష్టమైన భద్రతా చర్యలు, శాంతిభద్రతల పరిస్థితుల గురించి ప్రభుత్వానికి నివేదించారు. పాలనాపరమైన సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో, నేరాల నియంత్రణలో జిల్లా యంత్రాంగం అనుసరిస్తున్న విధానాలను ఈ సందర్భంగా వారు సమావేశం దృష్టికి తీసుకెళ్లారు.
Reporter
Namitha News