Wednesday, 29 July 2026 03:25:56 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

శివాజీ ట్రైల్ ట్రెక్ 2025 లో ప్రతిభ కనబర్చిన మిట్స్ విద్యార్థులు

ఆల్ ఇండియా ట్రెక్కింగ్ ఎక్స్‌పెడిషన్ లో మిట్స్ యూనివర్సిటీ విద్యార్థులు

Date : 28 December 2025 08:12 PM Views : 160

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 28 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీకి చెందిన 16 మంది యన్.సి.సి. క్యాడెట్స్ బృందం ఆల్ ఇండియా ట్రెక్కింగ్ ఎక్స్‌పెడిషన్ – శివాజీ ట్రైల్ ట్రెక్ 2025 కార్యక్రమం లో భాగంగా మహారాష్ట్ర రాష్ట్రంలోని కొల్హాపూర్‌లో విజయవంతంగా నిర్వహించబడిందని ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక శిబిరంలో మిట్స్ యూనివర్సిటీ నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డైరెక్టరేట్‌కు చెందిన 16 మంది యన్.సి.సి. క్యాడెట్లు, దేశ నలుమూలల నుండి 1000 మందికిపైగా పాల్గొని రాష్ట్రానికి మరియు దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఈ ఎక్స్‌పెడిషన్‌ లో భాగంగా క్యాడెట్లు చారిత్రాత్మకమైన పన్హాలా కోట నుండి విశాల్ ఘర్ కోట వరకు సుమారు 63 కిలోమీటర్ల దూరాన్ని కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో విజయవంతంగా పూర్తి చేశారు. శివాజీ మహారాజ్ చారిత్రక వారసత్వాన్ని గుర్తు చేసే ఈ ట్రెక్కింగ్ ద్వారా క్యాడెట్లలో శారీరక దృఢత్వం, మానసిక ధైర్యం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్పూర్తి మరియు దేశభక్తి భావనలు మరింత బలపడ్డాయి. ఈ కార్యక్రమంలో క్యాడెట్ల ప్రతిభా ప్రదర్శనతో మిట్స్ ఎన్సీసీ యూనిట్ సంస్థకు మరియు ఆంధ్రప్రదేశ్–తెలంగాణ డైరెక్టరేట్‌ గుర్తింపుకు గాను యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, యన్.సి.సి. ఆఫీసర్ కెప్టెన్ ఎన్.నవీన్ కుమార్, ఎన్సీసీ 35 ఆంధ్ర బెటాలియన్ - చిత్తూర్ వారు అభినందనలు తెలియజేశారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: