నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 28 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీకి చెందిన 16 మంది యన్.సి.సి. క్యాడెట్స్ బృందం ఆల్ ఇండియా ట్రెక్కింగ్ ఎక్స్పెడిషన్ – శివాజీ ట్రైల్ ట్రెక్ 2025 కార్యక్రమం లో భాగంగా మహారాష్ట్ర రాష్ట్రంలోని కొల్హాపూర్లో విజయవంతంగా నిర్వహించబడిందని ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక శిబిరంలో మిట్స్ యూనివర్సిటీ నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డైరెక్టరేట్కు చెందిన 16 మంది యన్.సి.సి. క్యాడెట్లు, దేశ నలుమూలల నుండి 1000 మందికిపైగా పాల్గొని రాష్ట్రానికి మరియు దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఈ ఎక్స్పెడిషన్ లో భాగంగా క్యాడెట్లు చారిత్రాత్మకమైన పన్హాలా కోట నుండి విశాల్ ఘర్ కోట వరకు సుమారు 63 కిలోమీటర్ల దూరాన్ని కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో విజయవంతంగా పూర్తి చేశారు. శివాజీ మహారాజ్ చారిత్రక వారసత్వాన్ని గుర్తు చేసే ఈ ట్రెక్కింగ్ ద్వారా క్యాడెట్లలో శారీరక దృఢత్వం, మానసిక ధైర్యం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్పూర్తి మరియు దేశభక్తి భావనలు మరింత బలపడ్డాయి. ఈ కార్యక్రమంలో క్యాడెట్ల ప్రతిభా ప్రదర్శనతో మిట్స్ ఎన్సీసీ యూనిట్ సంస్థకు మరియు ఆంధ్రప్రదేశ్–తెలంగాణ డైరెక్టరేట్ గుర్తింపుకు గాను యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, యన్.సి.సి. ఆఫీసర్ కెప్టెన్ ఎన్.నవీన్ కుమార్, ఎన్సీసీ 35 ఆంధ్ర బెటాలియన్ - చిత్తూర్ వారు అభినందనలు తెలియజేశారు.
Reporter
Namitha News