Sunday, 13 September 2026 07:46:44 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్

Date : 06 June 2026 06:42 PM Views : 172

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కూటమి పాలనలో ముస్లిం మైనారిటీలకు ఓరిగింది ఏమి లేదు... SIR పైన అప్రమత్తంగా ఉండాలి... ముస్లిం మైనారిటీ ఓట్లే వారి లక్ష్యం -- తనదైన శైలిలో వివరించిన మదనపల్లె సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ -- తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ గతంలో విలువైన వస్తువులు లోహాలు, గుర్రాలు, పశువులు కలిగిన వారు గొప్ప వారని, నేడు ఓటు కలిగిన వ్వక్తులే గొప్ప వారని మదనపల్లె YSRCP సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్‌ పేర్కొన్నారు. తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మదనపల్లె YSRCP సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రా నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్‌ పలు సూచనలు సలహాలు అందజేసినారు. స్పెషన్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)లో భాగంగా చేపట్టిన ఓటర్ల జాబితా పునఃపరిశీలన ప్రక్రియపై మదనపల్లె నియోజకవర్గం సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ విలువ సూచనలు సలహాలు ఇచ్చారు. (BLA) బూత్ లెవెల్ ఏజెంట్లు ఓటర్ల జాబితా పునపరిశీలన ప్రక్రియపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఓట్ల తొలగింపు కారణంగా ఎన్నికల ఫలితాలే తారుమారు అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక గ్రామాల్లో ఏ ఒక్క ఓటరూ మిస్ కాకుండా చూడాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో YSRCP అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, ఒక్క అర్హుడైన ఓటరు కూడా అన్యాయంగా జాబితా నుంచి తొలగింపుకు గురికాకుండా పార్టీ తరఫున నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో హేమాహేమీలకు ఎలాంటి పరిస్థితి నెలకొందో అందరూ చూశారని ఉదాహరణలతో వివరించారు. ప్రతి ఓటు విలువైనదే అని తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో ఒక ఓటు తేడాతో గెలుపు ఓటమి చూసిన ఘటనలు వివరించారు. ముస్లిం మైనారిటీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి:- కూట‌మి పాల‌న‌లో మైనారిటీల‌కు ప్రోత్సాహం, గౌర‌వం మాత్ర‌మే కాకుండా క‌నీసం ర‌క్ష‌ణ కూడా కరువైంద‌ని నిస్సార్ అహ్మద్ ధ్వ‌జ‌మెత్తారు. దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి త‌ర్వాత మైనారిటీల ప‌క్షాన నిల‌బ‌డి రాజ‌కీయంగా ప్రోత్స‌హించిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్మోహన్ రెడ్డి కే ద‌క్కుతుంద‌ని అన్నారు. ప్ర‌స్తుతం SIR పేరుతో జ‌రుగుతున్న ఓట‌రు లిస్టు స‌వ‌ర‌ణ విష‌యంలో మైనారిటీల ఓట్ల పట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ముస్లిం మైనారిటీలకు కూటమి ప్రభుత్వం చేసింది ఏమీలేదని నిస్సార్ అహ్మద్ అన్నారు.‌ YSRCP కి అండగా వున్న ముస్లింలకు కూటమి ప్రభుత్వ వైఫల్యాలు తీసుకుని వెళ్ళాలని వెల్లడించారు. రాష్ట్రంలో ముస్లిం వ్యక్తులు ముఖ్యమంత్రులుగా వున్న ముస్లిం లకు ఇంత ప్రయోజనాలు చేకూర్చి వుండలేరని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారానే సాధ్యమైందని నిస్సార్ అహమ్మద్ వివరించారు. YSRCP కి అండగా వున్న ముస్లిం లను డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారని, తగ్గట్టుగా మనం వారికి వివరించాలని సూచించారు. వెన్నుపోటుకు రెండేళ్ళు... మైనారిటీలకు కూటమి చేసింది శూన్యం:- పేద‌లైన ముస్లింల ప‌రిస్థితిని ఆస‌రాగా చేసుకుని మోసపు హామీలు గుప్పించి ఓటేయించుకున్న చంద్రబాబునాయుడు, అధికారం లోకి వ‌చ్చాక ఏ ఒక్క‌టీ నెరవేర్చ‌కుండా వెన్నుపోటు పొడిచాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల్లో హామీలు ఇవ్వ‌డం, అధికారంలోకి వ‌చ్చాక మోసం చేయ‌డం చంద్రబాబునాయుడుకు అల‌వాటైపోయింద‌ని మండిప‌డ్డారు. ముస్లిం మైనారిటీ వర్గాలను YSRCP నుంచి దూరం చేయడానికి కుయుక్తులు పన్నుడంలో చంద్రబాబునాయుడుకు మించిన వారు ఎవరూ లేరని ఇది గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సజ్జల రామచంద్రారెడ్డి, ఖాదర్ బాషా, హఫీజ్ ఖాన్, నూరీ ఫాతిమా, రుహుల్లా, ఇషాక్ సాహెబ్, అప్పిరెడ్డి, మదనపల్లె నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ యూనస్, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు, YSRCP నాయకులు పాల్గొన్నారు. ‌

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :