Wednesday, 29 July 2026 10:59:10 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

పోలీసులపై దాడి చేసిన హర్యానా వ్యక్తులు

పోలీసుల అదుపులో హర్యానా వ్యక్తులు

Date : 28 June 2026 08:22 AM Views : 206

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సదుం - జూన్ 28 : అన్నమయ్య జిల్లా సదుం పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తుకు బానిసైన ఇద్దరు హర్యానా వ్యక్తులు ఏకంగా పోలీసుల పైనే దాడికి తెగబడ్డారు విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ, సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

సదుం గాంధీ రోడ్డులోని సాయిబాబా దేవాలయం ఎదురుగా ఉన్న దస్తగిరి ఇంట్లో అద్దెకు ఉన్న హర్యానాకు చెందిన హితేశ్వర్, రామేశ్వర్ అనే ఇద్దరు వ్యక్తులు డ్రగ్స్ వినియోగిస్తూ, అక్రమంగా రివాల్వర్ కలిగి ఉండి స్థానికులను బెదిరిస్తున్నారనే పక్కా సమాచారంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సదుం ఎస్ఐ విష్ణు నారాయణ, కానిస్టేబుల్ సుబ్రమణ్యం, హోంగార్డు చాంద్ బాషా తనిఖీ కోసం వారి నివాసానికి వెళ్లగా తనిఖీలు నిర్వహించే క్రమంలో అనుమానాస్పద స్థితిలో ఉన్న హుక్కా మిషన్‌ను గమనించిన ఎస్ఐ ప్రశ్నించేలోపే, తీవ్ర మత్తులో ఉన్న ఆ వ్యక్తులు ఒక్కసారిగా ఎస్ఐ సహా పోలీసు సిబ్బందిపై దాడికి దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని తీవ్రంగా ప్రతిఘటించి అదుపులోకి తీసుకున్నారు. వారి నివాసంలో క్షుణ్ణంగా తనిఖీ చేయగా 10 లీటర్ల నాటుసారా, 18 మద్యం బాటిళ్లు, హుక్కా మిషన్, ఒక బాకు (కత్తి) లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దాడిలో గాయపడిన ఎస్ఐ, కానిస్టేబుల్, హోంగార్డులను సదుం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

ఈ దాడి ఘటన గురించి సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తక్షణమే స్పందిస్తూ గాయపడిన పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అసాంఘిక శక్తులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ పోలీసులపైనే దాడులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :