నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మే 12 : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పుంగనూరు పట్టణం లోని ప్రజలందరూ ఇతర రాష్ట్రాలు, స్థానికేతర ప్రాంతాల నుండీ తమ బతుకుదెరువు నిమిత్తం వలసవచ్చి కూలీ పనులు చేసుకొనే వారు మీదగ్గర ఉన్న యెడల ముఖ్యంగా భవన నిర్మాణ కాంట్రాక్టర్లు, హోటల్ యజమానులు, లాడ్జ్ యజమానులు, నివాస గృహాల యజమానులు, వ్యాపార సంస్థల యజమానులు, ఇటుక బట్టీల యజమానులు, గోదాముల యజమానులు మరియు ఆవుల షెడ్డు లలో, గృహ సేవకులుగా, వాచ్మెన్లుగా, పరిశ్రమలలో, గ్రానైట్ క్వారీ లలో పని చేస్తున్న కార్మికులను పనిలో ఉంచుకున్నట్టి యజమానులు ఈ ప్రకటన ద్వారా తెలియజేయునదేమనగా భద్రత కారణాల దృష్ట్యా, శాంతిభద్రతల పరిరక్షణ లో భాగంగా ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికుల పూర్తి వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్ వద్ద నమోదు చేయించడం ప్రతి యజమాని, కాంట్రాక్టర్ మరియు బాధ్యులైన వ్యక్తుల చట్టబద్ధమైన బాధ్యతగా భావించవలెను. ఈ క్రమంలో ఎవరి వద్ద ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారో, వారు తమ వద్ద పనిచేస్తున్న ఆ కార్మికుల పూర్తి పేరు, తండ్రి పేరు, స్వస్థలం చిరునామా, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, గతంలో పనిచేసిన ప్రదేశం, ప్రస్తుతం పనిచేస్తున్న ప్రదేశం, యజమాని పేరు, కాంట్రాక్టర్ పేరు, ఫోటోలు మరియు ఇతర అవసరమైన వివరాలను పోలీసు శాఖ నిర్దేశించిన ప్రొఫార్మాలో పూర్తి చేసి రెండు రోజులలో సమర్పించి పట్టణ ప్రజలు సహకరించాలని సూచిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు
Reporter
Namitha News