నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 25 : తంబళ్లపల్లె మండలం లో గురువారం క్రిస్టియన్ సోదరులు క్రిస్మస్ పండుగ ఘనంగా నిర్వహించుకున్నారు. తంబళ్లపల్లె మండల కేంద్రంలోని చర్చిలో పాస్టర్ పాల్ రాజ్ ఏసుక్రీస్తు ప్రవచనాలు బోధించారు. ఏసు ప్రభువు మనిషిలో ప్రేమ, దయ, కరుణ, క్ష మా గుణం కలిగి నిస్వార్ధంగా మానవ సేవ చేయాలని ప్రబోధించినట్లు హితబోధ చేశారు. అనంతరం ఆర్.ఎం.పి డాక్టర్ మున్నా పేదలకు బెడ్ షీట్లు పంపిణీ చేశారు. పలువురు దాతలు అన్నదానం, పలు రకాల సేవలు చేశారు. అదేవిధంగా ఎద్దుల వేమన్న గారి పల్లి, క్రాస్ రోడ్,ఏటిగడ్డ పల్లి, రేణుమాకులపల్లి, ఉప్పులూరి వాండ్లపల్లి, పంచాలమర్రి,కుక్క రాజు పల్లి చర్చల్లో క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఆంజనేయులు, పోర్టు నరసింహులు, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, దేవ శిఖామణి, రామలక్ష్మమ్మ, క్రిస్టియన్ సోదరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News