నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 05 : మండలంలోని ముద్దలదొడ్డి పంచాయతీలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి పంపిణి చేశారు. ఉదయం రాజంపేట టిడిపి రైతు సంఘం నాయకుడు వెంకట్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షురాలు సరస్వతిలు ముఖ్యమంత్రి సహాయని చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కూటమిపాలనలో ఎన్నడూ లేని విధంగా నిరుపేదల ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి పంపిణీ చేయడం ద్వారా నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ముద్దలదొడ్డి పంచాయతీలోని కూటమి ప్రభుత్వంలో పలు అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి, సంక్షేమ పథకాలు అందించినట్లు చెప్పారు. ఈ పంపిణీ కార్యక్రమంలో టిడిపి, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News