Wednesday, 29 July 2026 11:09:37 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

అకడమిక్ నుండీ పరిశ్రమ వరకూ అనే అంశం అతిధి ఉపన్యాసం

Date : 16 February 2026 10:32 PM Views : 283

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 16 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మరియు స్కిల్ డెవలప్మెంట్ సెల్ విభాగం వారు మిట్స్ ఐ.ఈ.టీ.ఈ స్టూడెంట్ చాప్టర్ వారి సహకారంతో వీ.ఎల్‌.ఎస్‌.ఐ మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ అకాడెమిక్ నుండి పరిశ్రమ వరకు ప్రయాణం” అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బెంగళూరు కు చెందిన క్వాల్‌కామ్ కంపెనీ సీనియర్ లీడ్ ఇంజనీర్, అభిషేక్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో సెమీకండక్టర్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది అని, అనేక జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలు చిప్ డిజైన్ కేంద్రాలను స్థాపించడం ద్వారా వీ.ఎల్‌.ఎస్‌.ఐ చిప్ డిజైన్ రంగంలో శిక్షణ పొందిన ఈసీఈ విద్యార్థులకు అధిక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. అకాడెమిక్ స్థాయిలో అభ్యసించే సి.మాస్ సెమీకండక్టర్ సాంకేతికత, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ తయారీ ప్రక్రియ, మ్యాక్స్‌వెల్ సమీకరణాలు, ప్రసార రేఖలు మరియు తరంగ ప్రసరణ వంటి ప్రాథమిక అంశాలు పరిశ్రమలో ఎంత ముఖ్యమో వివరించారు. విద్యుత్ క్షేత్రం మరియు అయస్కాంత క్షేత్రం ప్రయాణించే తరంగాలు ద్వారా యాంటెన్నా రూపకల్పన వంటి ప్రాజెక్టులపై ప్రయోగాత్మక అనుభవం పెంపొందించుకోవచ్చని తెలిపారు. రేడియో ఫ్రీక్వెన్సీ మరియు మైక్రోవేవ్ రూపకల్పన, చిప్ ధృవీకరణ వంటి ఆధునిక రంగాల్లో నైపుణ్యాభివృద్ధి ద్వారా మెరుగైన కెరీర్ అవకాశాలు సాధ్యమవుతాయని అన్నారు. చిప్ డిజైన్ నైపుణ్యం కలిగిన ఇంజినీర్లకు పరిశ్రమల్లో విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉండటంతో పాటు, భవిష్యత్తు సాంకేతిక అభివృద్ధిలో ఇవి మరింత కీలకంగా మారనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎస్.రాజశేఖరన్, కోఆర్డినేటర్ వి.ఎస్ ప్రశాంత్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: