Monday, 14 September 2026 10:59:05 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

యన్.సి.సి. సైబర్ డిఫెండర్ లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన మిట్స్ విద్యార్ధి

Date : 26 June 2026 07:38 PM Views : 94

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 26 : మదనపల్లి పట్టణం అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి, ఎన్‌సీసీ క్యాడెట్ అండర్ ఆఫీసర్ ఎన్. సాయి హార్థిక్ కుమార్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక సైబర్ డిఫెండర్ కోర్స్–Iలో విశేష ప్రతిభ కనబరిచారని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. చెన్నైలోని వీఐటీ (VIT Chennai)లో 12 రోజులపాటు నిర్వహించిన జాతీయ స్థాయి శిక్షణా శిబిరంలో తొలి 10 రోజుల పాటు సైబర్ సెక్యూరిటీ, సైబర్ డిఫెన్స్, డిజిటల్ భద్రత, నెట్‌వర్క్ సెక్యూరిటీ తదితర ఆధునిక సాంకేతిక అంశాలపై నిపుణులచే శిక్షణ అందించారని తెలిపారు. అనంతరం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ పరీక్షకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 268 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు ఈ శిబిరంలో పాల్గొనగా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ఎన్‌సీసీ డైరెక్టరేట్ తరఫున తిరుపతి గ్రూప్ నుంచి కేవలం 8 మంది క్యాడెట్లలో చిత్తూరు జిల్లా 35(ఏ) బెటాలియన్ ఎన్‌సీసీ నుంచి ఎంపికైన ఏకైక క్యాడెట్‌గా ఎన్. సాయి హార్థిక్ కుమార్ నిలవడం గర్వకారణం అని తెలిపారు. ఈ శిబిరాన్ని ఎన్‌సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వత్స, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్-నికోబార్ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కమోడోర్ నంబియత్ సుదీప్ లు పర్యవేక్షణ వహించి సర్టిఫికెట్ ను అందజేశారని తెలిపారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన యెన్ సి సి విద్యార్థిని యూనివర్సిటీ ఫౌండర్ అండ్ చాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ ఎన్. నవీన్ కుమార్ మరియు 35 ఆంధ్ర బెటాలియన్ చిత్తూర్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కల్నల్ మోనిష్ ఎన్.వి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కల్నల్ పీ. లోకనాథన్ అభినందనలు తెలియజేశారు. 35 ఆంధ్ర బెటాలియన్ చిత్తూర్ తరపున సహాయసహకారాలు అందించిన కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కల్నల్ మోనిష్ ఎన్.వి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కల్నల్ పీ. లోకనాథన్ లకు ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ ఎన్. నవీన్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :