నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అమరావతి ఛాంపియన్షిప్–2026లో అన్నమయ్య జిల్లా క్రీడాకారులు చూపిన ప్రతిభ గర్వకారణం.... అమరావతి ఛాంపియన్షిప్–2026లో, అన్నమయ్య జిల్లా తరఫున పాల్గొన్న క్రీడాకారులు, వివిధ క్రీడాంశాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి, పతకాలు సాధించిన విషయం విదితమే. రాష్ట్ర స్థాయి పోటీల్లో బ్యాడ్మింటన్లో మోతుకూరి కళ్యాణి మరియు కందుకూరి లక్ష్మీ సింధూర ద్వితీయ స్థానాలు సాధించగా, బాక్సింగ్లో రన్ టీవీ అధినేత, మదనపల్లి పట్టణానికి చెందిన సిరివెలు చరణ్ కుమారుడు అయిన సిరివెలు నిఖిల్ దేవ్ నాయుడు ద్వితీయ స్థానం సాధించారు. అలాగే అథ్లెటిక్స్లో సుంకు గంగాధర్ జావెలిన్ త్రో విభాగంలో ద్వితీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా అమరావతి ఛాంపియన్షిప్ విజేతలు మరియు రన్నర్స్ కలసి, తమకు అందించిన మెడల్స్తో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారిని మరియు జాయింట్ కలెక్టర్ ని కూడా మర్యాదపూర్వకంగా కలిసి, తమ విజయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ ఇరువురు క్రీడాకారులను అభినందించి, వారి విజయాలను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, అన్నమయ్య జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ డిఎస్డిఓ జి చంద్రశేఖర్ మాట్లాడుతూ, అమరావతి ఛాంపియన్షిప్–2026లో అన్నమయ్య జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి, పతకాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని, తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని, తెలిపారు.
Reporter
Namitha News