Sunday, 13 September 2026 04:53:36 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట

Date : 17 November 2025 12:30 AM Views : 207

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 16 : రామసముద్రం మండల కేంద్రంలోని కర్ణాటక భార్డర్ లోని కురుబురు గ్రామంలో నూతనంగా అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభం విగ్రహ ప్రతిష్ట కనులు పండువగా నిర్వహించడం జరిగింది. అయ్యప్ప స్వామి దేవాలయాన్ని బిజెపి నారాయణరాజు సొంత నిధులు రాజకీయ నాయకులు, ప్రముఖులు గ్రామస్థులు సహాయ సహకారాలతో నూతనంగా ఆలయాన్ని నిర్మించి ఆదివారం విగ్రహప్రతిష్ట చేశారు.వేకువ జామున అర్చకులు వేదమంత్రాలతో కళశారాధన, హోమాలు నిర్వహించి బ్రహ్మ ముహూర్తంలో విగ్రహ ప్రతిష్టించారు. ఆలయ పునః ప్రతిష్టకు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అధికారులు, గ్రామపెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారి బెంగళూరు గానిగరల్లి రవికుమార్ రాజు (బాబు )రాధ, వల్లాల దర్శన్ ముఖ్య అతిథు లుగా హాజరయ్యారు. అయ్యప్ప స్వామి ఆలయ ధర్మ కర్త నారాయణ రాజు ధర్మపత్ని కరుణ కుమారుడు రాజా ఘనస్వాగతం పలికారు.అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రవికుమార్ మాట్లాడుతూ కురుబురు గ్రామంలో బిజెపి నారాయణరాజు ఆధ్వర్యంలో ప్రజల బాగస్వామ్యంతో అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించడం ఎంతో ఆనందంగా ఉందని, అందులో తాము పాల్గొనడం సంతోషంగా ఉందని ఆ అయ్యప్ప ఆశీస్సులతో గ్రామ ప్రజలతో పాటు అందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రతిఒక్కరి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో రవికుమార్,రాధ, రాజ, దర్శన్ రాజకీయ ప్రముఖులు, అధికారులు, బంధువులు, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రతిష్ట లో పాల్గొన్న భక్తులకు నారాయణ రాజు,కరుణ రాజ కుటుంబ సభ్యులఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: