Thursday, 30 July 2026 01:21:16 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట

Date : 17 November 2025 12:30 AM Views : 172

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 16 : రామసముద్రం మండల కేంద్రంలోని కర్ణాటక భార్డర్ లోని కురుబురు గ్రామంలో నూతనంగా అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభం విగ్రహ ప్రతిష్ట కనులు పండువగా నిర్వహించడం జరిగింది. అయ్యప్ప స్వామి దేవాలయాన్ని బిజెపి నారాయణరాజు సొంత నిధులు రాజకీయ నాయకులు, ప్రముఖులు గ్రామస్థులు సహాయ సహకారాలతో నూతనంగా ఆలయాన్ని నిర్మించి ఆదివారం విగ్రహప్రతిష్ట చేశారు.వేకువ జామున అర్చకులు వేదమంత్రాలతో కళశారాధన, హోమాలు నిర్వహించి బ్రహ్మ ముహూర్తంలో విగ్రహ ప్రతిష్టించారు. ఆలయ పునః ప్రతిష్టకు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అధికారులు, గ్రామపెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారి బెంగళూరు గానిగరల్లి రవికుమార్ రాజు (బాబు )రాధ, వల్లాల దర్శన్ ముఖ్య అతిథు లుగా హాజరయ్యారు. అయ్యప్ప స్వామి ఆలయ ధర్మ కర్త నారాయణ రాజు ధర్మపత్ని కరుణ కుమారుడు రాజా ఘనస్వాగతం పలికారు.అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రవికుమార్ మాట్లాడుతూ కురుబురు గ్రామంలో బిజెపి నారాయణరాజు ఆధ్వర్యంలో ప్రజల బాగస్వామ్యంతో అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించడం ఎంతో ఆనందంగా ఉందని, అందులో తాము పాల్గొనడం సంతోషంగా ఉందని ఆ అయ్యప్ప ఆశీస్సులతో గ్రామ ప్రజలతో పాటు అందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రతిఒక్కరి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో రవికుమార్,రాధ, రాజ, దర్శన్ రాజకీయ ప్రముఖులు, అధికారులు, బంధువులు, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రతిష్ట లో పాల్గొన్న భక్తులకు నారాయణ రాజు,కరుణ రాజ కుటుంబ సభ్యులఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :