నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 16 : రామసముద్రం మండల కేంద్రంలోని కర్ణాటక భార్డర్ లోని కురుబురు గ్రామంలో నూతనంగా అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభం విగ్రహ ప్రతిష్ట కనులు పండువగా నిర్వహించడం జరిగింది. అయ్యప్ప స్వామి దేవాలయాన్ని బిజెపి నారాయణరాజు సొంత నిధులు రాజకీయ నాయకులు, ప్రముఖులు గ్రామస్థులు సహాయ సహకారాలతో నూతనంగా ఆలయాన్ని నిర్మించి ఆదివారం విగ్రహప్రతిష్ట చేశారు.వేకువ జామున అర్చకులు వేదమంత్రాలతో కళశారాధన, హోమాలు నిర్వహించి బ్రహ్మ ముహూర్తంలో విగ్రహ ప్రతిష్టించారు. ఆలయ పునః ప్రతిష్టకు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అధికారులు, గ్రామపెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారి బెంగళూరు గానిగరల్లి రవికుమార్ రాజు (బాబు )రాధ, వల్లాల దర్శన్ ముఖ్య అతిథు లుగా హాజరయ్యారు. అయ్యప్ప స్వామి ఆలయ ధర్మ కర్త నారాయణ రాజు ధర్మపత్ని కరుణ కుమారుడు రాజా ఘనస్వాగతం పలికారు.అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రవికుమార్ మాట్లాడుతూ కురుబురు గ్రామంలో బిజెపి నారాయణరాజు ఆధ్వర్యంలో ప్రజల బాగస్వామ్యంతో అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించడం ఎంతో ఆనందంగా ఉందని, అందులో తాము పాల్గొనడం సంతోషంగా ఉందని ఆ అయ్యప్ప ఆశీస్సులతో గ్రామ ప్రజలతో పాటు అందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రతిఒక్కరి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో రవికుమార్,రాధ, రాజ, దర్శన్ రాజకీయ ప్రముఖులు, అధికారులు, బంధువులు, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రతిష్ట లో పాల్గొన్న భక్తులకు నారాయణ రాజు,కరుణ రాజ కుటుంబ సభ్యులఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.
Reporter
Namitha News