నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 22 : ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘమైన ఆంధ్రప్రదేశ్ వీధివిక్రయదారుల కార్మిక ఫెడరేషన్ నందు అంతర్భాగంగా ఏర్పాటు చేసుకున్న బి.కొత్తకోట ఏరియా సమితికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎఐటియుసి మాజీ అధ్యక్షులు ఎస్.మనోహర్ రెడ్డి తెలిపారు.బుధవారం జరిగిన సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షులుగా జి.రఘునాథ్, అధ్యక్షులుగా ఎం.సయ్యద్ బాషా, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ వసీం,టీ.సావిత్రి,బి.మనోహర్ లను, ప్రధాన కార్యదర్శిగా బి.పర్వీజ్ అహ్మద్,సహాయ కార్యదర్శులుగా వి.చలపతి,బి.అక్బర్ బాషా,ఎస్.అఫ్రోజ్ ఖాన్ లను,కోశాధికారిగా కే.నర్సింహులు,సలహాదారులుగా ఎస్.జాఫర్ వల్లి, ఎల్.ముబారక్ లను, మరియు కమిటీ సభ్యులుగా కే.సయ్యద్ భాష,జి.లక్ష్మీనరసమ్మ,ఎస్.అమీర్ భాష,ఎస్.షా మీర్,పి.స్వరూప,ఎస్.బా వాజాన్,బి.వసీం,బి.శ్రీనివాసులు,వి.బావాజాన్,జి. శ్రీనివాసులు,డి.శ్రీలక్ష్మి,జే.మమత,పి,శ్యామల,ఎస్. ఫయాజ్ ఖాన్,పి.రామానుజులు, మస్తాన్,ఏ.జమీర్ అహ్మద్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.నూతనంగా ఎన్నికైన ఎం.సయ్యద్ భాష మాట్లాడుతూ; నామీద నమ్మకంతో కార్మికులు మరియు ఏఐటియుసి నాయకులు నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసి,కార్మికులు నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం కార్మికుల సమస్యల సాధన కోసం పని చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కార్మిక నాయకులు ఎస్.బషీర్ ఖాన్, ఎం.అష్రఫ్అల్లీ,ఎస్. తంబయ్యశెట్టి, హెచ్.షమీవుల్లా మరియు వీధివిక్రయదారులు పాల్గొన్నారు
Reporter
Namitha News