Sunday, 13 September 2026 11:22:21 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు

Date : 16 April 2026 05:25 PM Views : 369

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 16 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ కు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ, న్యూ ఢిల్లీ వారు 2025–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" (సార్వత్రిక మానవ విలువలు) కోసం నోడల్ సెంటర్‌గా గుర్తింపు లభించిందని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్ తెలియజేశారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, విలువల ఆధారిత విద్యా విధానం, సమాజ సేవా దృక్పథం పెంపొందించడం వంటి అంశాల్లో మిట్స్ చూపుతున్న నిరంతర కృషిని గుర్తించి గౌరవ గుర్తింపు ధ్రువపత్రంను అందజేశారు. సార్వత్రిక మానవ విలువలను విద్యా వ్యవస్థలో సమన్వయం చేయడం, ఇతర విద్యాసంస్థలకు కూడా ఈ విలువలను విస్తరించడం, పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక బాధ్యతల పట్ల విద్యార్థులు, అధ్యాపకులను ప్రోత్సహించడం వంటి అంశాలు ఈ గుర్తింపుకు కారణమయ్యాయి. మిట్స్ యూనివర్సిటీ అందిస్తున్న విలువల ఆధారిత విద్య దేశ నిర్మాణానికి దోహదపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా మానవ విలువలను పెంపొందించే విద్యను మరింత బలోపేతం చేస్తామని, విద్యార్థులను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడంలో మిట్స్ యూనివర్సిటీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్. యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ యూ.హెచ్.వి సెల్ మెంబెర్స్ మరియు అధ్యాపకులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్,యూనివర్సిటీ యూ.హెచ్.వి సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ బి జగదీశ్ బాబు మరియు కో-కోఆర్డినేటర్ డాక్టర్ కే చంద్ర మోహన్ లు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :