Sunday, 13 September 2026 04:29:35 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

ఐపీఎల్ పేరుతో జూదం ఆడితే కఠిన చర్యలు - ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

క్రికెట్ బుకీలు, ఆన్ లైన్ జూదగాళ్ళ పై ప్రత్యేక నిఘా

Date : 28 March 2026 10:53 PM Views : 198

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 28: నేటి నుంచి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమవుతున్న సందర్భంగా, అన్నమయ్య జిల్లా ప్రజలను హెచ్చరిస్తూ జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి శనివారం ఒక కీలక సందేశాన్ని విడుదల చేశారు. యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా, క్రికెట్‌ను కేవలం క్రీడలాగే చూడాలని ఆయన పేర్కొన్నారు

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఆశకు పోయి జీవితాన్ని పాడుచేసుకోవద్దంటూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని బుకీలు చెప్పే మాటలు నమ్మకండి. బెట్టింగ్ అనేది ఒక విషవలయం. ఒక్కసారి అందులో పడితే అప్పుల ఊబిలో కూరుకుపోయి, కుటుంబం రోడ్డున పడి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం ఉందని తెలిపారు. బుకీలకు చెక్ పెట్టాలి, అమాయక విద్యార్థులను, యువతను ఆకర్షించే బుకీల ఆటలు సాగనివ్వమని, అక్రమాలకు పాల్పడితే కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్ట్ లో హాజరు పరుస్తామని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ జూదగాళ్లపై నిఘా పెట్టాం స్మార్ట్‌ఫోన్లలో సీక్రెట్ యాప్స్, టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపులు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా బెట్టింగ్ నిర్వహించే ముఠాలపై స్పెషల్ బ్రాంచ్, సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా ప్రత్యేక నిఘా పెట్టాం. ప్రతి పైసా లావాదేవీని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా పట్టుబడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు, యువత జాగ్రత్త గా ఉండాలి సరదాగా మొదలయ్యే ఈ అలవాటు మీ కెరీర్‌ను దెబ్బతీస్తుంది. పోలీస్ కేసు నమోదైతే ఉద్యోగాలు, పాస్‌పోర్ట్ రావడం కష్టమవుతుందని, యువత తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకోవాలని ఎస్పీ గారు సూచించారు. తల్లిదండ్రులకు విజ్ఞప్తి:* మీ పిల్లలు మొబైల్ ఫోన్లలో ఎక్కువగా ఏం చూస్తున్నారు? వారి ప్రవర్తనలో ఏవైనా మార్పులు వచ్చాయా? అనేది గమనించండి. వారి బ్యాంక్ ఖాతాల నుంచి అనుమానాస్పదంగా డబ్బులు కట్ అవుతుంటే వెంటనే అప్రమత్తం కావాలి

ప్రజలు సహకరించాలని తెలియచేస్తూ మీ ప్రాంతంలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100/112 కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయని తెలిపారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :