నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 30 : తంబళ్లపల్లె ఆదర్శ పాఠశాలలో ప్రకృతి వ్యవసాయం తో పెరటి తోటలు పెంపకం స్ఫూర్తిదాయకమని స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి కొనియాడారు. పాఠశాల ఆవరణంలో సేంద్రియ ఎరువులు, కషాయాలతో కూరగాయలు టమోటా, వంగ, మిర్చి, బెండ,ఆకుకూరలు, పండ్ల మొక్కలు డ్రిప్ సిస్టం తో పెంచడంపై ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శ పాఠశాల ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా నిల పాలని సూచించారు. పెరటి తోటల పెంపకం పై ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బందిని ప్రశంసించారు. మండలంలో ప్రతి పాఠశాల, అంగన్వాడీలు, సచివాలయాల ఆవరణాలలో ఇలాంటి పెరటి తోటలు పెంచడానికి స్ఫూర్తినివ్వాలని ఎంఈఓ త్యాగరాజు, ఏవో కామర్స్ రాజా కు సూచించారు.ఆయన వెంట ఎంఈఓ త్యాగరాజు, ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్ , ప్రసాద్ లు ఉన్నారు
Reporter
Namitha News