నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 10 : రామసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో డాక్టర్ ప్రత్యూష ఆధ్వర్యంలో 39 మంది గర్భిణీ స్త్రీలకు సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్, రక్తపోటు హీమోగ్లోబిన్ పరీక్షలతో పాటు అవసరమైన మందులు పంపిణీ చేశారు.డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్టిక ఆహారం పాలు, గుండ్లు, ఆకుకూరలు బాగా తీసుకోవాలని ప్రతి రోజు నడవాలని ఎప్పటికప్పుడు డాక్టర్ సలహాలు తీసుకోవాలన్నారు.డాక్టర్ సలహాలు పాటిస్తే మహిళలకు సురక్షిత ప్రసవం అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రత్యూష సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News