నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మొలకలచెర్వు - డిసెంబర్ 09 : మొలకలచెర్వు కు సమీపంలోని గాలేటి వారి పల్లికి సమీపంలో గత 20 సంవత్సరాల నుండి భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్న ఓ వృద్ధుడు ఈరోజు ఉదయం మరణించడం తో , మృతదేహం అలానే ఉందని విషయం తెలుసుకున్న గాలేటివారిపల్లి ప్రజలు యస్.ఐ. నరసింహుడికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని ఎస్ఐ నరసింహుడు దహన కార్యక్రమాలు తన సొంత నిధులతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కోనంగి శ్రీనివాసులు, కోనంగి హరీష్, డేరంగుల మస్తాన్, పూజారి హనుమంతు, కోనంగి ప్రశాంత్, విష్ణు, జహీర్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News