నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - మే 21 : అన్నమయ్య జిల్లా లో అసంపూర్తిగా ఉన్న 8076 పక్కా గృహాల నిర్మాణాలు? ఆగస్టు చివరికి పూర్తి చేయాలని అన్నమయ్య జిల్లా హౌసింగ్ పీడీ రమేష్ రెడ్డి సూచించారు . గురువారం ఆయన డిఇ వెంకట్ రెడ్డి తో కలిసి మండలం లోని కోరుకొండ,కొటాల పంచాయతీలలో జరుగుతున్న పిఎంఎవై 2.0 పథకం కింద నిర్మాణం జరుగుతున్న పక్కా గృహాల నిర్మాణాలను పరిశీలించారు. పక్కా ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, నాణ్యత లోపించకుండా చూడాలని సూచించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లో 637 పక్కా గృహాలు ఆగస్టు చివరి మాసానికి పూర్తి చేయాలని సూచించారు. గృహ నిర్మాణాల లబ్ధిదారుల సమస్యలపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మాణాల పనితీరుపై ఆరా తీసి నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేయడానికి కృషి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట హౌసింగ్ ఏఈ సుజాత, ఆపరేటర్ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News