నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - డిసెంబర్ 26 :: సిపిఐ పార్టీ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతవార్షికోత్సవ ఆవిర్భావ వేడుకలను ఆత్మకూరు పట్టణం లోని మున్సిపల్ బస్టాండ్ ప్రాంతంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా నాయకులు రాష్ట్ర సిపిఐ పార్టీ సంయుక్త కార్యదర్శి మధు, స్థానిక టౌన్ కార్యదర్శి జంగం నాగరాజు, హజరత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. మొదట మున్సిపల్ బస్టాండ్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి మధు మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని పార్టీ ఏర్పడి నేటికీ వందేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తూ అందులో భాగంగా నేను ఆత్మకూరులో ఈ కార్యక్రమ నిర్వహించామని అన్నారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని వీరీ తీరు మారకుంటే తాము ఉద్యమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో , ఇండ్ల అంకమ్మ, కొండయ్య, నాగేంద్ర, బాబు,హాజరత్తయ్య,చెంచయ్య,హరి బాబు తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News