నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె -జూన్ 07 : మదనపల్లి పట్టణం అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన ఎన్సీసీ క్యాడెట్లు జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కనబరిచారని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఎన్.సి.సి విభాగానికి చెందిన ద్వితీయ సంవత్సరం మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి క్యాడెట్ రామిరెడ్డి లక్ష్మణ్ మరియు ప్రథమ సంవత్సరం సైబర్ సెక్యూరిటీ విద్యార్థిని క్యాడెట్ మల్లెపుల భార్గవి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్లో మే 25 నుండి జూన్ 3, 2026 వరకు నిర్వహించిన ప్రతిష్టాత్మక సండక్ఫూ హిమాలయన్ ట్రెక్కింగ్ ఎక్స్పెడిషన్లో పాల్గొన్నారు. ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల ఎన్సీసీ డైరెక్టరేట్ నుంచి ఎంపికైన ఇద్దరు క్యాడెట్లు మిట్స్ యూనివర్సిటీ విద్యార్థులు కావడం గర్వకారణమని అన్నారు. ఈ సాహస యాత్రలో ఇండోర్ రాక్ క్లైంబింగ్ పోటీలు, ట్రీ టాప్ పోటీలు, ఇండో-నేపాల్ సరిహద్దు వెంబడి ధోత్రే నుంచి శ్రీఖోలా వరకు 68 కిలోమీటర్ల కఠిన ట్రెక్కింగ్, సండక్ఫూ సన్రైజ్ వ్యూపాయింట్ యాత్ర, 22 కిలోమీటర్ల టైగర్ హిల్–డార్జిలింగ్ ట్రెక్ వంటి అనేక సాహస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో డార్జిలింగ్లోని హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఇండోర్ రాక్ క్లైంబింగ్ పోటీలో క్యాడెట్ మల్లెపుల భార్గవి దేశవ్యాప్తంగా పాల్గొన్న ఎన్సీసీ క్యాడెట్ల మధ్య తృతీయ స్థానం సాధించి యూనివర్సిటీ కు మరింత కీర్తిని తీసుకొచ్చిందని తెలిపారు తమ విజయానికి సహకరించిన 35 ఆంధ్రప్రదేశ్ బెటాలియన్ ఎన్.సి.సి, చిత్తూర్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ . ఎన్..వి. మోనిస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ పి.లోగనాథన్ మరియు ఎన్సీసీ గ్రూప్ హెడ్క్వార్టర్స్ తిరుపతి వారికి క్యాడెట్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్రెకింగ్ లో ప్రతిభ చూపిన క్యాడెట్లను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ ఎన్ విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్, ఎన్ సి సి ఆఫీసర్ కెప్టెన్ నవీన్ కుమార్ మరియు అధ్యాపకులు అభినందించారు
Reporter
Namitha News