నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 08 : అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణము తూర్పు మొగసాల వద్ద గత 30 సంవత్సరాల క్రితం దాతలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మూడు అంగడి రూములు దానం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ వారు రూములు నుంచి వచ్చే ఆదాయంతో ధూప దీప నైవేద్యాన్ని ఉపయోగించేవారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అంగడి రూములను రాత్రికి రాత్రి జెసిబి సహాయంతో నేలమట్టం చేశారు.నేలమట్టమైన అంగడి రూముల వద్ద శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు.శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములను కాపాడాలని వారు కోరారు
Reporter
Namitha News