నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మిట్స్లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు మదనపల్లె : మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలోని మిట్స్ సోషల్ రెస్పాన్సిబుల్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.వినాయక చవితిని పురస్కరించుకొని ఎకో బప్పా మోరియా 3.0 కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీ ప్రాంగణంలో ఆదివారం మట్టి వినాయక విగ్రహాల తయారీ పోటీలను నిర్వహించారు.ఈ పోటీల్లో మొత్తం 74 బృందాలు ఉత్సాహంగా పాల్గొని వివిధ ఆకృతుల్లో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను రూపొందించారు.ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ మాట్లాడుతూ వినాయక చవితి హిందువులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ అని,అయితే రసాయనాలు,హానికర పదార్థాలతో తయారు చేసే విగ్రహాల వల్ల నీటి వనరులు,పర్యావరణం కలుషితమవుతున్నాయన్నారు.ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలన్నారు.మట్టి వినాయకుడిని పూజించడం అంటే ప్రకృతిని పూజించడమేనని,మట్టి మన జీవనానికి ఆధారమైన సహజ వనరు కాబట్టి మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.విద్యార్థులు రూపొందించిన మట్టి వినాయక విగ్రహాలను పరిశీలించిన అనంతరం మొదటి బహుమతిని ఆర్.అనూష అండ్ టీం,రెండవ బహుమతి ఎస్ లహరి అండ్ టీం మరియు మూడవ బహుమతి అభిషేక్ అండ్ టీం విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డీన్-అక్రిడిటేషన్స్ డాక్టర్ ఏ.వి పవన్ కుమార్,సి.ఎస్.టి విభాగాధిపతి డాక్టర్ దినేష్,ఎంఎస్ ఆర్ క్లబ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.రెడ్డి హేమంత,శాయీజ్ అహమ్మద్,డాక్టర్ నవీన్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News