Thursday, 30 July 2026 07:37:35 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా 8 ఎలక్ట్రికల్ ఈ-ఆటోలు పంపిణీ చేసిన జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్

Date : 12 January 2026 06:16 PM Views : 218

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 12 : గ్రామాలను పరిశుభ్రంగా చేసి ఉంచడం, ఇంటింటి చెత్త సేకరణను సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా మంజూరైన ఎనిమిది ఎలక్ట్రికల్ ఆటోలను పాత అన్నమయ్య జిల్లా ప్రతిపాదన లో భాగంగా చిన్నమండెం మండలం పడమటి కోన పంచాయితీ, ఓబుల్ వారి పల్లి మండలం ఓబులవారిపల్లి పంచాయతీకి, వీరబల్లి మండలం ఓడివీడు పంచాయతీకి, కలికిరి మండలం పాతేగడ పంచాయతీ , అద్దావారిపల్లి పంచాయతీకి, మదనపల్లి మండలం కొత్త ఇండ్లు పంచాయతీ, తంబళ్లపల్లి మండలం పారతోపు పంచాయతీ, సంబేపల్లి మండలం సంబేపల్లి గ్రామ పంచాయతీ, ఈ–ఆటోలను గ్రామ పంచాయతీలకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి సంయుక్తంగా పంచాయతీలకు పంపిణీ చేశారు. మొత్తం 8 ఎలక్ట్రికల్ ఈ–ఆటోలను అందజేశారు.ఒక్కో ఈ–ఆటో విలువ రూ. 3,75,000/- కాగా, వీటిని గ్రామీణ ప్రాంతాల్లో డోర్ టు డోర్ చెత్త సేకరణ, చెత్త తరలింపు మరియు శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ కోసం వినియోగించనున్నట్లు తెలిపారు.గ్రామీణ పారిశుధ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే రోజువారీ చెత్త సేకరణ తప్పనిసరి అని, ఈ–ఆటోల వినియోగం ద్వారా గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు గణనీయంగా మెరుగుపడతాయని అన్నారు. పరిశుభ్రమైన గ్రామాలు ఆరోగ్యవంతమైన సమాజానికి పునాదిగా నిలుస్తాయని, ప్రజలు చెత్తను వేరు చేసి అందజేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని,ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ మెరుగుపడి, స్వచ్ఛ గ్రామాలు – ఆరోగ్యకర గ్రామాలు లక్ష్యం సాకారం అవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ, పంచాయతీ ప్రతినిధులు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :