Thursday, 16 April 2026 04:50:03 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

పశు ఆరోగ్య శిబిరం లను సద్వినియోగం చేసుకోండి - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి

ఈనెల 19 నుండి 31 వరకు జాతీయ పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్న పశుసంవర్ధక శాఖ

Date : 19 January 2026 04:08 PM Views : 66

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 19 : ఈనెల 19 నుండి 31 వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడే జాతీయ పశు ఆరోగ్య శిబిరాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని, పశువులకు వచ్చే పలు వ్యాధులకు మందులు మరియు టీకాల పంపిణీ జరుగుతుందని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం మదనపల్లి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో రూపొందించిన జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంపై గోడ పత్రికను మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ మధుసూదనరావుతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ పశువులకు సకాలంలో టీకాలు వేయించడం ద్వారా ఎన్నో వ్యాధులను అరికట్టవచ్చని తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చు అన్నారు. అన్నమయ్య జిల్లాలో ఈనెల 19 నుండి 31 వరకు పశువులకు దూడలకు మరియు సన్న జీవాలకు నట్టల నివారణ మందులు ఉచితంగా త్రాపించబడతాయని, గొర్రెలు మేకలకు ఉచితంగా బొబ్బ వ్యాధి చీడపారుడు, చిటుక, నీలి నాలుక, వంటి వ్యాధులకు వ్యాధి టీకాలు ఉచితంగా అందించడం జరుగుతుందని వ్యాధులకు టీకాలు పంపిణీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ టీకాలను మరియు మందులను రైతులందరూ వినియోగించుకొని పశువులకు వచ్చే వ్యాధులు నివారించుకోవచ్చని సూచించారు. శాస్త్రీయ పశు యాజమాన్య పద్ధతులు మరియు పశువిజ్ఞానం పై అవగాహన సదస్సులు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. గోకులాలు వాటి నిర్మాణం పై అవగాహన కల్పించడం జరుగుతుందని, సంచార పశు ఆరోగ్య సేవ కేంద్రాలు నిర్వహించబడతాయని, పశు బీమా పథకం అమలు పశు కిసాన్ క్రెడిట్ కార్డు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. రైతులందరూ ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని మదనపల్లి సబ్ కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదనరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ పిళ్ళై, ఆ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :