Tuesday, 15 September 2026 08:55:15 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

మల్లయ్య కొండ శైవ క్షేత్రానికి ఐదోసారి పుష్పాలంకరణ చేసిన నల్లగుండ్ల హేమలత, మల్లికార్జున రెడ్డి దంపతులు

Date : 14 February 2026 09:26 PM Views : 257

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 14 ః తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండ శైవ క్షేత్రానికి ఐదోసారి పుష్పాలంకరణ చేసే భాగ్యం మా కుటుంబానికి దక్కడం పూర్వజన్మ సుకృతమని గోపిదిన్నె పంచాయతీ చెరువు ముందరపల్లి కు చెందిన రియల్టర్(బెంగళూరు మల్లి) నల్ల గుండ్ల మల్లికార్జున రెడ్డి, హేమలత దంపతులు కొనియాడారు. ప్రతి ఏటా సుమారు ఐదు లక్షల ఖర్చుతో ఆలయంలో బెంగళూరు నుండి వందలాది రకాల ఫల పుష్పాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఓ సామాన్య రైతుబిడ్డగా జీవితం ప్రారంభించిన మల్లికార్జున రెడ్డి శివయ్య సేవలో తరించి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదగడానికి మల్లయ్య కొండ మహా శివుడే విజయ సోపానంగా నిలవడంతో ఆ కుటుంబం దశాబ్ద కాలంగా వేలాది మందికి కులం, మతం, ప్రాంతం, పార్టీలకతీతంగా తంబళ్లపల్లె నుండి బెంగుళూరు వరకు ఆపన్న హస్తం అందించి నిరుపేదలు, అభాగ్యులకు, తనకున్నంతలో ఆర్థిక సహాయం చేసి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలవడం ప్రశంసనీయమని సర్వత్ర హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్భంగా నల్లగుండ్ల మల్లికార్జున రెడ్డి, హేమలత దంపతులు మాట్లాడుతూ మా కుటుంబం ఈ స్థాయికి చేరడానికి మల్లయ్య కొండ మహాశివుడేనని ఆయన ఆశీస్సులతో భవిష్యత్తులో సైతం శక్తి వంచన లేకుండా నిరుపేదలకు మరింత సేవ చేసే భాగ్యం కల్పించి తంబళ్లపల్లె ప్రాంత ప్రజలు పాడి పంటలు, సుఖ సంతోషాలతో జీవించాలని ఆ పార్వతీ పరమేశ్వరులను ఆకాంక్షించినట్లు తెలిపారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :