Wednesday, 29 July 2026 03:31:28 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

వాయల్పాడు, పీలేరు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

Date : 21 January 2026 08:53 PM Views : 170

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 21 : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి బుధవారం రాయచోటి సబ్ డివిజన్ పరిధి లోని వాయల్పాడు మరియు పీలేరు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ల లోని రికార్డులను, లాకప్ రూమ్ ను మరియు పరిసరాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పర్యటనలో ఎస్పీ పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి ముఖ్య సూచనలు చేశారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. బాధితులకు భరోసా కల్పించి, వారి సమస్యలను చట్టభద్ధంగా త్వరితగతిన పరిష్కరించాలి. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో గస్తీ పెంచాలి. పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలి. పెండింగ్‌లో ఉన్న కేసులను శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తు చేసి, త్వరితగతిన ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలి. మహిళలు, పిల్లల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి పోలీస్ అధికారి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, తద్వారా నేరాల ఛేదనలో వేగం పెరుగుతుందని సూచించారు. సిబ్బంది సంక్షేమ పై దృష్టి సారించాలని, ఆయా పోలీస్ స్టేషన్ అధికారులకు సూచించారు.

ప్రజలకు నిద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ గుర్తుతెలియని వ్యక్తులకు ఓటిపి లు చెప్పవద్దని, ఏదైనా మోసం జరిగితే వెంటనే 1930 కి ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరారు. గ్రామాలలోని కొత్త వ్యక్తుల గురించి లేదా అనుమానాస్పద కదలికల గురించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాయచోటి డిఎస్పీ మహేంద్ర , పీలేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగంధర్ , ఎస్ఐలు లోకేష్, ఎస్ రహీం, వాయల్పాడు ఎస్ఐ తిప్పేస్వామి మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: