Thursday, 30 July 2026 02:10:06 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ప్రజల ఆర్థిక స్వాలంబన కోసం బ్యాంకులు సహకరించాలి - లీడ్ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు

Date : 13 February 2026 11:27 PM Views : 180

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 13 ః తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని బ్యాంకులు రైతులు, మహిళ సంఘాలు, కక్షిదారులు, పారిశ్రామికవేత్తల ఆర్థిక స్వాలంబన కోసం సహకరించాలని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ జి ఆంజనేయులు సూచించారు. శుక్రవారం ఐకెపి కార్యాలయంలో త్రైమాసిక ఆర్థిక లావాదేవీల పై బ్యాంకు అధికారులు, పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు మాసాల రైతులు, మహిళా సంఘాలు, ఇతరత్రా రుణాల పంపిణీ, రికవరీలపై ఆరా తీశారు. బ్యాంకు లింకేజీలు, కిసాన్ కార్డులు, పశు కిసాన్ కార్డులు,రబీ క్రాప్ ఇన్సూరెన్స్, సి సి ఆర్ సి, ఉదయం రిజిస్ట్రేషన్, తోబాటు పిఎం ఈజీపి, పి ఎం ఎం వై, పీఎం సూర్య ఘర్ మఫ్ట్ బిజిలి యోజన, పీఎం విశ్వకర్మ, ముద్ర హ్యాండ్లూమ్ రుణాలు, పి యం డిడి కే వై మరియు పీఎం స్వనిధి పథకాల రుణాలపై వివరణ అడిగారు. అదేవిధంగా బ్యాంకులకు సంబంధించి సైబర్ నేరాలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వపరంగా అర్హులైన వారికి రుణ పంపిణీకి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపిఎం ప్రసాద్ రెడ్డి వ్యవసాయ అధికారి రమణ కుమార్, ఐకెపి ఎపిఎం గంగాధర్, నియోజకవర్గంలోని బ్యాంకు మేనేజర్లు, పశువైద్య జె.వి.ఓ కిరణ్, వ్యవసాయ శాఖ ఏఈఓ సురేష్, సి.సి.లు కత్తి నరసింహులు, రమణ, అధికారులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: