నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 16 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని పెద్దకురప్పల్లె గ్రామ పంచాయితీ మట్లవారిపల్లె గ్రామంలో గట్టుశివాలయంలో ఆదివారం అంబలపూజా మహోత్సవం ఘనంగా నిర్వహించారు.ఉదయం నుండి అయ్యప్ప స్వామి ఆలయంలో విద్యుత్ దీపాలంకరణ, పచ్చని తోరణాలతో ముస్తాబు చేశారు, 41రోజు మాలదారణలో అయ్యప్ప స్వాములకు మొదటి సంవత్సరం మాలవేసిన స్వాములకు కన్యపూజలు, రెండవ సంవత్సరం మాలవేసిన అయ్యప్పలకు కత్తిపూజ మూడవ సారి వేసిన స్వాములకు గంటపూజ,గద పూజ వేదమంత్రాలతో గురుస్వాములు అయ్యప్ప, శివ రెడ్డెప్ప,ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి పన్నీరు, గంధం,పచ్చకర్పూరం వీభూదిలతో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని శుభ్రం చేసి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈవేడుకల్లో పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రం నిర్వహించారు. ఈ పూజలో అయ్యప్ప భజనలు భక్తులను అకట్టుకొన్నాయి. ఈ అంబళం పూజ కార్యక్రమంలో గట్టు అయ్యప్ప స్వామి బృందం స్వాములు, భక్తులు తదితరులు గ్రామస్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News