Thursday, 16 April 2026 04:48:17 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

గాలివీడు పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

రికార్డుల నిర్వహణపై ఆరా, సరిహద్దు గ్రామాల్లో డ్రోన్లతో నిఘా ఉంచాలని ఆదేశం

Date : 07 February 2026 06:50 PM Views : 82

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గాలివీడు - ఫిబ్రవరి 07: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి శనివారం గాలివీడు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పనితీరును, శాంతిభద్రతల పరిస్థితులను ఆయన నిశితంగా పరిశీలించారు. అధికారులకు మరియు సిబ్బందికి విధి నిర్వహణపై పలు కీలక సూచనలు చేస్తూ, పలు రికార్డులు, ప్రాపర్టీ భద్రతపై ఆరా, ముఖ్యంగా కేస్ డైరీ (సీడీ) ఫైళ్ల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఇతర విలువైన వస్తువులను స్టేషన్ ఆవరణలో అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలని ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విషయంలో ఎటువంటి అలసత్వం వహించకూడదని, రికార్డులకు అనుగుణంగా వాటిని పక్కాగా నిర్వహించాలని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో డ్రోన్ల నిఘా మండల సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు సాగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. "సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. అక్రమ రవాణా లేదా ఇతర అసాంఘిక పనులకు తావు లేకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలి. అవసరమైన చోట అధునాతన డ్రోన్ కెమెరాల సహాయంతో నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. టెక్నాలజీని వాడుకుంటూ నేరగాళ్ల ఆటకట్టించాలని సూచించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఈ సందర్బంగా ఎస్పీ సిబ్బందితో మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత కావాలని, స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని చెప్పారు. గ్రామాల్లో చెడు నడత గల వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజు నాయక్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (వెల్ఫేర్) పెద్దయ్య, గాలివీడు ఎస్ఐ నరసింహారెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :