Sunday, 13 September 2026 03:51:09 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

పల్లె లల్లో అలుముకుంటున్న కరువు చాయలు

జీవన భృతి కల్పించాలి బి.కె.యం.యు. జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప

Date : 16 July 2026 02:54 PM Views : 140

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 16 : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పుంగనూరు మండల సమితి సమావేశం నేడు స్థానిక ముడెప్ప సర్కిల్లో జరిగినది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు కృష్ణప్ప , ఎఐటియుసి పట్టణ కార్యదర్శి వెంకటరమణారెడ్డి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రామ్మూర్తి, సహాయ కార్యదర్శి మున్నా పాల్గొని వారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి చెమ్మ లేక తాగినీటి బోర్లు వ్యవసాయ బోర్లు ఎండిపోయి భూగర్భ జలాలు దెబ్బతిని వ్యవసాయ కూలీలకు పనులు లేక కరువు ఛాయాల్లో అలుముకుంటున్నాయని ప్రస్తుతం పెరుగుతున్న నిత్యవసర ధరలు కూలీలు దొరక్క ఆదాయం లేక జీవన పరిస్థితులు దారుణంగా దిగజారుతున్నాయని అందుకోసమే వలసల నివారణ కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రతికూలికి పని కల్పించి రోజు కూలి 700 రూపాయలు చెల్లించాలని మట్టి పనులు చెరువు గట్టు పనులు వర్షాలు లేక గట్టితనం ఉండడం వల్ల పనులు చేయలేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని కనుక పని చేసినా చేయకపోయినా జీవించటానికి జీవన భృతి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే పుంగనూరు నియోజకవర్గంలో ఇండ్ల స్థలాలు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న ఇంతవరకు కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడం దుర్మార్గం. ఈ రాష్ట్రంలో లక్షల మంది వృద్ధులు వికలాంగులు వితంతులు దీర్ఘకాలిక రోగిగ్రస్తులు వెయ్యి కళ్ళతో పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వం మొండి చేయి మాత్రమే చూపిస్తున్నది. అలాగే ఈనెల 24వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం జరుగుతున్నదని ఈ సమావేశంలో వ్యవసాయ కూలీలు పేదలు దళితులు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పైన చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని ప్రతి వ్యవసాయ కూలీలకు మూడెకరాలు ప్రభుత్వ మిగిలి భూమి పంపిణీ చేయాలని కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులు అమలు చేయాలని పేదలకు ఇవ్వాల్సిన భూములు బడా కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పజెప్తున్నారని పేదలు కడుపుకొట్టేటువంటి అసైన్డ్ చట్ట సవరణ 9/77 చట్టాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు మా భాష, అరుణ్ కుమార్, ఏఐటియుసి పట్టణ నాయకులు వాసు, ఫయాజ్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :