నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 27 : తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ కు తంబళ్లపల్లె పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొటాల శివకుమార్ ఘన సన్మానం చేశారు. బుధవారం ఆయన స్వగృహంలో కొటాల శివకుమార్ తో పాటు పలువురు సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ ను పూలమాలలు, దుశ్యాలవులతో సన్మానించి తంబళ్లపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని మీ సారుద్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాలు చిత్తుచిత్తుగా ఓడిస్తామన్నారు.మాజీ ఎమ్మెల్యే వారిని అభినందిస్తూ తంబళ్లపల్లె లోటిడిపిని బలోపేతం చేసి కూటమి నాయకుల ఐకమత్యంతో తంబళ్లపల్లెను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలవడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు
Reporter
Namitha News