Wednesday, 16 September 2026 01:00:32 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

రామసముద్రం లో ఘనంగా స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న జయంతి వేడుకలు

Date : 11 January 2026 07:42 PM Views : 1442

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జనవరి 11 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం కేంద్రం మరియు నరసాపురం గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ వారిని గడ గడలాడించిన వడ్డేఓబన్న 219 జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు, ఉదయం 11గంటలకు నరసాపురం గ్రామం, ఎంపిడిఓ కార్యాలయం,మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆయన చిత్రపటానికి పూలహారాలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా పూజలు నిర్వహించి బానాసంచాలు కాలుస్తూ భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు, నరసాపురం గ్రామంనుండి వందలాది మంది వడ్డేర కుటుంబ సభ్యులు బైక్ ర్యాలీ గా మండల కేంద్రానికి తరలి వచ్చి అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి జై ఒడ్డెర ఓబన్న జైభారత్ అంటూ నినాదాలు చేశారు.ఓబన్న జయంతి సందర్బంగా పలువురు మాట్లాడుతూ వడ్డే ఓబన్న సైరా నరసింహారెడ్డి తో కలిసి పోరాటం చేసి తొలి స్వాతంత్ర సమరయోధుడుగా వడ్డెర ఓబన్న కు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం సంతోషకరమన్నారు. అన్నమయ్య జిల్లా లోని అన్ని ప్రభుత్వకార్యాలయాలలో ఆయన జయంతి ఉత్సవాలను జరపడం సంతోషకరమన్నారు. వడ్డెర ఓబన్న స్వాతంత్ర సమరంలో సైరా నరసింహారెడ్డి తో కలిసి పోరాడిన మొదటి వ్యక్తి అని కొనియాడారు. ఎంతోమంది తెల్లదొరల ప్రాణాలను తీసి దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన మహాయోధుడని కొనియాడారు.అదేవిధంగా వడ్డెర కులాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించారు.నరసాపురం గ్రామంలో గ్రామ పెద్దలు, గ్రామస్థులు ఆధ్వర్యంలో ఒడ్డెర ఓబన్న చిత్రపటానికి పూజలు చేసి బాణాసంచాలు కాలుస్తూ భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఓబన్న జయంతి వేడుకల్లో అశేషంగా వడ్డెర కులబాందవ్యులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి నరసాపురం గ్రామస్తులు గొప్ప అన్నదానకార్యక్రమం నిర్వహించారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :