నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జనవరి 11 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం కేంద్రం మరియు నరసాపురం గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ వారిని గడ గడలాడించిన వడ్డేఓబన్న 219 జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు, ఉదయం 11గంటలకు నరసాపురం గ్రామం, ఎంపిడిఓ కార్యాలయం,మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆయన చిత్రపటానికి పూలహారాలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా పూజలు నిర్వహించి బానాసంచాలు కాలుస్తూ భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు, నరసాపురం గ్రామంనుండి వందలాది మంది వడ్డేర కుటుంబ సభ్యులు బైక్ ర్యాలీ గా మండల కేంద్రానికి తరలి వచ్చి అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి జై ఒడ్డెర ఓబన్న జైభారత్ అంటూ నినాదాలు చేశారు.ఓబన్న జయంతి సందర్బంగా పలువురు మాట్లాడుతూ వడ్డే ఓబన్న సైరా నరసింహారెడ్డి తో కలిసి పోరాటం చేసి తొలి స్వాతంత్ర సమరయోధుడుగా వడ్డెర ఓబన్న కు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం సంతోషకరమన్నారు. అన్నమయ్య జిల్లా లోని అన్ని ప్రభుత్వకార్యాలయాలలో ఆయన జయంతి ఉత్సవాలను జరపడం సంతోషకరమన్నారు. వడ్డెర ఓబన్న స్వాతంత్ర సమరంలో సైరా నరసింహారెడ్డి తో కలిసి పోరాడిన మొదటి వ్యక్తి అని కొనియాడారు. ఎంతోమంది తెల్లదొరల ప్రాణాలను తీసి దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన మహాయోధుడని కొనియాడారు.అదేవిధంగా వడ్డెర కులాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించారు.నరసాపురం గ్రామంలో గ్రామ పెద్దలు, గ్రామస్థులు ఆధ్వర్యంలో ఒడ్డెర ఓబన్న చిత్రపటానికి పూజలు చేసి బాణాసంచాలు కాలుస్తూ భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఓబన్న జయంతి వేడుకల్లో అశేషంగా వడ్డెర కులబాందవ్యులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి నరసాపురం గ్రామస్తులు గొప్ప అన్నదానకార్యక్రమం నిర్వహించారు.
Reporter
Namitha News