నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 12 : తంబళ్లపల్లి మోడల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు ఈ లలిత మరియు పి బెల్నాద్ సాయిలు ఎన్ ఎం ఎస్ పరీక్షలలో తమ ప్రతిభ కనబరిచి అర్హత సాధించడంతో స్కాలర్షిప్ సాధించినట్లు ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్ తెలిపారు. ఇరువురు విద్యార్థులకు ఏడాదికి రూ12వేలు చొప్పున నాలుగు సంవత్సరాలు పాటు స్కాలర్షిప్లు సాధించినట్లు చెప్పారు. లిఖిత, బెల్నాథ్ లను ప్రతిభను ఎంఈఓలు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు లు కొనియాడుతూ వారి కృషికి సహకరించిన ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, అధ్యాపకులను ప్రశంసిస్తూ భవిష్యత్తులో ఇదే ఒరవడితో విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు.
Reporter
Namitha News