Wednesday, 29 July 2026 05:26:41 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

కోటకొండ లో జలజీవన్ పనులకు ఆర్ & బి బ్రేక్

ఉన్నతాధికారులు స్పందించండం లేదని విస్తుపోతున్న కాంట్రాక్టర్లు

Date : 23 February 2026 10:25 PM Views : 229

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 23 ః రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలజీవన్ మిషన్ పథకానికి ఆర్ అండ్ బి అధికారులు అడుగడుగునా పనులకు బ్రేక్ వేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన తంబళ్లపల్లె మండల కేంద్రంలో జలజీవన్ మిషన్ పైప్ లైన్ wj పనులను ఆర్ అండ్ బి అధికారులు అడ్డు తగలగా అప్పట్లో ఆర్డబ్ల్యూఎస్ డిఆర్ఈవో సతీష్ కుమార్, డి.ఈ చంద్రశేఖర్ రెడ్డి, డిపిఎం సంజయ్, ఏఈఈలు వినోద్ కుమార్, దినేష్, రియాజ్ లు తరలివచ్చి సమస్య పరిష్కారానికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడారు. ఈ విషయం మరువకనే సోమవారం సాయంత్రం మండలంలోని కోటకొండ వద్ద జరుగుతున్న జలజీవన్ పైప్లైన్ పనులను ఓ ఆర్ అండ్ బి అధికారి అడ్డుకున్నారు. పైపులైన్ పనులకు అనుమతి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదరు కాంట్రాక్టర్ జగన్నాథన్ సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ డీఈ తో ఫోన్లో మాట్లాడారు. వారి నుండి సానుకూల సమాధానం రాకపోవడంతో ఆయన జలజీవన్ మిషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తంబళ్లపల్లె మండలంలో జల జీవన్ మిషన్ పైప్ లైన్ పనులు శరవేగంగా జరుగి దాదాపు పూర్తికావస్తున్నాయి. ఈ నేపథ్యంలో పైప్ లైన్ పనులను అడుగడుగునా ఆర్ అండ్ బి అధికారుల అడ్డుకోవడం తో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో జలజీవన్ పథకానికి ఆదిలోనే హంసపాదు చందాన తయారయింది. తంబళ్లపల్లె నియోజకవర్గం వేసవిలో తరచూ తాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం పరిపాటి.ఈ సమస్యపై స్పందించిన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పైలట్ ప్రాజెక్టు కింద తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి నియోజకవర్గవర్గాలకు రూ 2370 కోట్లతో ప్రతి ఇంటికి స్వచ్ఛ నీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి ప్రజాహిత బృహత్ కార్యక్రమాలకు తరచూ అడ్డంకులు రావడం తో ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తలనొప్పిగా మారింది. శాశ్వత తాగునీటిa సమస్య పరిష్కారం అవుతుందని ఆశపడిన గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ సమస్య శాపంగా నిలవడం పై ప్రజలు విమర్శలు సంధిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తో పాటు జిల్లా ఉన్నతాధికారులు యుద్ధ ప్రాతిపదికన స్పందించి జల జీవన్ మిషన్ పైప్ లైన్ పనులు త్వరగా పూర్తిచేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీరు అందించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :