Monday, 08 June 2026 09:56:25 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

కోటకొండ లో జలజీవన్ పనులకు ఆర్ & బి బ్రేక్

ఉన్నతాధికారులు స్పందించండం లేదని విస్తుపోతున్న కాంట్రాక్టర్లు

Date : 23 February 2026 10:25 PM Views : 190

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 23 ః రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలజీవన్ మిషన్ పథకానికి ఆర్ అండ్ బి అధికారులు అడుగడుగునా పనులకు బ్రేక్ వేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన తంబళ్లపల్లె మండల కేంద్రంలో జలజీవన్ మిషన్ పైప్ లైన్ wj పనులను ఆర్ అండ్ బి అధికారులు అడ్డు తగలగా అప్పట్లో ఆర్డబ్ల్యూఎస్ డిఆర్ఈవో సతీష్ కుమార్, డి.ఈ చంద్రశేఖర్ రెడ్డి, డిపిఎం సంజయ్, ఏఈఈలు వినోద్ కుమార్, దినేష్, రియాజ్ లు తరలివచ్చి సమస్య పరిష్కారానికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడారు. ఈ విషయం మరువకనే సోమవారం సాయంత్రం మండలంలోని కోటకొండ వద్ద జరుగుతున్న జలజీవన్ పైప్లైన్ పనులను ఓ ఆర్ అండ్ బి అధికారి అడ్డుకున్నారు. పైపులైన్ పనులకు అనుమతి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదరు కాంట్రాక్టర్ జగన్నాథన్ సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ డీఈ తో ఫోన్లో మాట్లాడారు. వారి నుండి సానుకూల సమాధానం రాకపోవడంతో ఆయన జలజీవన్ మిషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తంబళ్లపల్లె మండలంలో జల జీవన్ మిషన్ పైప్ లైన్ పనులు శరవేగంగా జరుగి దాదాపు పూర్తికావస్తున్నాయి. ఈ నేపథ్యంలో పైప్ లైన్ పనులను అడుగడుగునా ఆర్ అండ్ బి అధికారుల అడ్డుకోవడం తో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో జలజీవన్ పథకానికి ఆదిలోనే హంసపాదు చందాన తయారయింది. తంబళ్లపల్లె నియోజకవర్గం వేసవిలో తరచూ తాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం పరిపాటి.ఈ సమస్యపై స్పందించిన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పైలట్ ప్రాజెక్టు కింద తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి నియోజకవర్గవర్గాలకు రూ 2370 కోట్లతో ప్రతి ఇంటికి స్వచ్ఛ నీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి ప్రజాహిత బృహత్ కార్యక్రమాలకు తరచూ అడ్డంకులు రావడం తో ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తలనొప్పిగా మారింది. శాశ్వత తాగునీటిa సమస్య పరిష్కారం అవుతుందని ఆశపడిన గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ సమస్య శాపంగా నిలవడం పై ప్రజలు విమర్శలు సంధిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తో పాటు జిల్లా ఉన్నతాధికారులు యుద్ధ ప్రాతిపదికన స్పందించి జల జీవన్ మిషన్ పైప్ లైన్ పనులు త్వరగా పూర్తిచేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీరు అందించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :