Monday, 02 March 2026 06:50:49 AM
# ఘనంగా నిర్వహించిన టైలర్స్ డే వేడుకలు # విద్యా పర్యటన లో ఏపీ శాసనసభ ను సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తంబళ్లపల్లె లో 30 వేల జనసేన సభ్యత్వమే మా లక్ష్యం -మైఫోర్స్ మహేష్ # తంబళ్లపల్లె లో ఘనంగా మాదిగ అమరవీరుల సంస్మరణ సభ # చెట్టు పై నుండీ పడి రైతు కు గాయాలు # చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # కనబడకుండా పోయిన వ్యక్తి దారుణ హత్య # తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జిగా జి శంకర్... ? # గ్రీన్ అంబాసిడర్లకు చెత్త వాహనాలు పంపిణీ # తంబళ్లపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 93.44% పంపిణీ # మార్చి 5వ తేదీలోగా 100% ఇండ్ల పన్ను వసూలు చేయాలి - డి.ఎల్.పి.ఓ. నాగరాజు # ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ # ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చెయ్యాలి - సీపీఎం డిమాండ్ # మిట్స్ లో ఘనంగా స్మృతి సంగమం-2026 # మిట్స్ లో ఘనంగా జాతీయ సైన్స్ డే # మెడికల్ మాఫియా ను అరికట్టాలంటూ డి.యం.హెచ్.ఓ. కార్యాలయం వద్ద సిపిఐ నిరసన # శ్రీరామ్ చినబాబు కు అభినందనల వెల్లువ # విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో CSE & AI & DS విభాగాల ఆధ్వర్యంలో వర్క్‌షాప్ # కృత్రిమ మేధస్సుతో శాస్త్ర విజ్ఞానానికి కొత్త దిశలు

ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

దిగువ గొల్లపల్లి లో చామంతి పూల తోటను పరిశీలించిన కలెక్టర్

Date : 28 February 2026 09:03 PM Views : 39

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సదుం/ సోమల - ఫిబ్రవరి 28 : శనివారం ఉదయం సదుం, సోమల మండలాలలో ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి గ్రామాలను పట్టణాలతో అనుసంధానం చేయడానికి ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం కింద చేపడుతున్న పనులలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలంలోని T17- పి పి సి రోడ్డు నుండి పి పి సి రోడ్డు వరకు పొట్టెంవాయిపల్లె తిమ్మనాయని పల్లె ద్వారా పొడవు 0.00 కి. మీ నుండి 9.97కి. మీ వరకు జి ఎస్ బి మరియు డబ్ల్యూ ఎం ఎం పూర్తయిన పనులను మరియు సోమల మండలంలో కలికిరి రోడ్డు నుండి నిమ్మనపల్లె మండల సరిహద్దు కందూరు వరకు 8.00 కి. మీ నుండి 15.38 కి. మీ వరకు పూర్తయిన పనులను స్వయంగా పరిశీలించారు. ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం కార్యక్రమంలో పూర్తి చేయాల్సిన పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేయాలని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా నిర్మాణంలో ఎటువంటి లోపాలు ఉండకూడదని, ప్రతి దశలో సాంకేతిక ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. సదుం మండలం, చింతపర్తి వారి గ్రామపంచాయతీ పరిధిలోని దిగువ గొల్లపల్లి సమీపంలోని రైతు గంగిరెడ్డి సాగు చేస్తున్న చామంతి పూల తోటను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పంట సాగు విధానం, దిగుబడి, పండించిన పూలను స్థానిక మార్కెట్లతో పాటు సమీప పట్టణాలకు విక్రయిస్తున్నట్లు రైతు కలెక్టర్కు వివరించారు. పూలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ఆధునిక సాగు పద్ధతులు అవలంబించాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయంలో వైవిధ్యీకరణ ద్వారా రైతుల ఆదాయం పెంపు ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, ఉద్యాన పంటల సాగుపై మరింత దృష్టి రైతులు సారించాలని అవసరమైన సాంకేతిక సలహాలు, ఉద్యానవన శాఖ ద్వారా సహాయం అందిస్తామని రైతుకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో ప్రాజెక్టు అమలు విభాగం ఏఈఈ ప్రవళిక, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :