నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 21 : మదనపల్లి పట్టణం లో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాష అక్కడ భోజనం చేస్తున్న వారిని భోజనం బాగుందా అంటూ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు, ప్రజా సంక్షేమం కోసం ఎల్లప్పుడూ టిడిపి పాటు పడుతుందని అందులో భాగంగానే రైతులకు పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలవుతుందని తెలిపారు. మార్కెట్ దగ్గర నున్న అన్న క్యాంటీన్ లో సుదూర ప్రాంతాల నుండి వచ్చే రైతులకు అన్న క్యాంటీన్ లో భోజనం చేసి మార్కెట్లో హాయిగా నిద్రపోవచ్చు అని తెలిపారు. అనంతరం ఉదయం లేచి మళ్లీ అన్న క్యాంటీన్ లో భోజనం చేసి ఇంటికి వెళ్లచ్చు అని ప్రజల కోసమే ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు
Admin
Namitha News