నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నమిత న్యూస్ - ఏప్రిల్ 17 : మదనపల్లి నుండి రామసముద్రం పోవు రహదారి పెంచుపాడు సమీప ప్రాంతం రెక్కమాను వద్ద ఆర్టీసీ బస్సు పంటపొలాలల్లోకి దూసుకుపోయిందని,గత కొన్ని సంవత్సరాలుగా మదనపల్లి నుండి రామసముద్రం పోవు రోడ్డు పాలకుల నిర్లక్ష్యానికి గురవుతుందని సిపిఐ మండల కార్యదర్శి డి రెడ్డి శేఖర్ ఆవేదన వ్యక్తంచేశారు. మదనపల్లి నుండి చెమ్మకూరు పోవు ప్రధాన రహదారి ప్రమాదకర మలుపులు ఉన్నవి,రోడ్డు మొత్తం గుంతల మాయమైపోయిందని,ఆసియా ఖండంలోనే మదనపల్లె టమోట మార్కెట్ ప్రసిద్ధిగాంచిందని, ఇలాంటి టమోటా మార్కెట్ కు పెంచుపాడు, చెంబుకూరు, రామసముద్రం ఈ ప్రాంతాల నుండి సుమారు 50% పైన పండిస్తారని, ఈ ప్రాంతంలో పండించిన టమోటా మొత్తం ఈ ప్రమాదకరమైన రోడ్డుపైనే రవాణా జరగాలని, రోజుకు కొన్ని వందల లోడ్లు ఈ రోడ్డు మీదనే మదనపల్లి మార్కెట్ కు తరలిస్తారని, రోజువారి కొన్ని వేల మంది ఉపాధి కోసం మదనపల్లి పట్టణానికి ఎదే రోడ్డుపైన ప్రయాణం చేస్తారని,ఇలాంటి రోడ్డుకు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చేంబకూరు రోడ్డు పరిస్థితి మాత్రం ఏమాత్రం మారలేదని,ఈ రోడ్డుకు డబుల్ రోడ్డు ఆవశ్యకత ఎంతైనా ఉంది కానీ సీపీఐ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక మార్లు కార్యక్రమాలు చేపట్టిన ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి మదనపల్లి నుండి రామసముద్రం వరకు డబుల్ రోడ్డు చేయాలని డిమాండ్ చేశారు
Reporter
Namitha News