Sunday, 13 September 2026 04:36:13 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్ విద్యార్థులకు జోహో పేరోల్ & జోహో బుక్స్ శిక్షణా కార్యక్రమం

స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ మరియు చెన్నై లోని కెరీర్ స్కూల్ హెచ్‌ఆర్ సొల్యూషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం

Date : 07 July 2026 08:17 PM Views : 208

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 07 : మదనపల్లె సమీపం లోని అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విభాగం వారు మరియు కెరీర్ స్కూల్ హెచ్‌ఆర్ సొల్యూషన్స్, చెన్నై సంయుక్త ఆధ్వర్యంలో ఎంబీఏ విద్యార్థుల కోసం 45 రోజుల జోహో పేరోల్ మరియు జోహో బుక్స్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ కార్తీక్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కాత్యాయని, కెరీర్ స్కూల్ హెచ్.ఆర్ సోలుషన్స్ , చెన్నై పాల్గొన్నారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ కాత్యాయని మాట్లాడుతూ నేటి కార్పొరేట్ ప్రపంచంలో డిజిటల్ బిజినెస్ అప్లికేషన్లపై ప్రావీణ్యం అత్యంత అవసరమని, ముఖ్యంగా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, అకౌంటింగ్, పేరోల్ అడ్మినిస్ట్రేషన్, స్మాల్ బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో ఉద్యోగాలు సాధించాలంటే ఆధునిక ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్‌లపై అవగాహన తప్పనిసరి అని తెలిపారు. ఈ 45 రోజుల శిక్షణలో విద్యార్థులకు జోహో పేరోల్, జోహో బుక్స్ సాఫ్ట్‌వేర్‌లపై ప్రత్యక్ష (హ్యాండ్స్-ఆన్) శిక్షణ, ఉద్యోగుల డేటాబేస్ నిర్వహణ, పేరోల్ ప్రాసెసింగ్, చట్టబద్ధమైన పేరోల్ అనుసరణలు, హాజరు మరియు సెలవుల నిర్వహణ, వేతనాల గణన, బుక్‌కీపింగ్, జీఎస్‌టీఇన్వాయిసింగ్, బ్యాంక్ రీకన్సిలియేషన్, ఆర్థిక నివేదికల తయారీ, క్లౌడ్ ఆధారిత అకౌంటింగ్ విధానాలు వంటి అంశాలపై సమగ్ర శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీన్-స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డాక్టర్. భాను శ్రీ రెడ్డి మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు పరిశ్రమకు అవసరమైన డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు, వాస్తవ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యం, విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని హెచ్‌ఆర్, ఫైనాన్స్, అకౌంటింగ్, బిజినెస్ ఆపరేషన్స్ రంగాల్లో ఇంటర్న్‌షిప్‌లు మరియు ఉద్యోగ అవకాశాలను మరింత విస్తరించుకోగలరని తెలిపారు. పరిశ్రమ–విద్యాసంస్థల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు విద్యార్థులను ఆధునిక కార్పొరేట్ రంగ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తాయని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీన్-స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డాక్టర్. భాను శ్రీ రెడ్డి, కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటేశ్వర్లు , అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: