నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే20 : దశాబ్దాలుగా అణగారిన మాదిగ జాతి బిడ్డలు నేడు ప్రతి ఒక్కరు చదువుకుని పోరాటంతో సాధించుకున్న రిజర్వేషన్ ఫలాలను పొందాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు డానియల్ మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం మండల అధ్యక్షుడు గంగాధర్, ఇంచార్జ్ వేటా మల్లికార్జున, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటప్ప ఆధ్వర్యంలో జరిగిన ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు 50 గోటు విలేజ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామం లోని చదువుకు దూరంగా ఉన్న మాదిగ జాతి బిడ్డలను గుర్తించి స్థానికంగా గల పాఠశాలల్లో చేర్పించడంతో బాటు విద్యార్థులు, యువతి యువకులకు విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా చేపట్టి వంద శాతం మాదిగ బిడ్డలు చదువుకుని భవిష్యత్తులో వారు ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎమ్మార్పీఎస్ నాయకులు నడుం బిగించాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి మండలాలు, నియోజకవర్గ ఇన్చార్జిలు కృషి చేయాలని నిర్లక్ష్యం చేసే వారిపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గంగాధర్, రాములమ్మ, రెడ్డమ్మ, ఆదినారాయణ, నరసింహులు, రెడ్డప్ప, రెడ్డప్ప నాయుడు, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News