Monday, 14 September 2026 07:38:18 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

అన్నమయ్య జిల్లా డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసిన షేక్ రెడ్డి సాహెబ్

Date : 27 November 2025 11:31 PM Views : 217

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - నవంబర్ 27 : అన్నమయ్య జిల్లా రాయచోటి లో సంఘటన్ శ్రీజన్ అభియాన్ (సంస్థాగత నిర్మాణ కార్యక్రమం ) కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన ఏఐసీసీ అబ్జర్వర్ కె మహేంద్రన్ మరియు ఏపీసీసీ అబ్జర్వర్ అశోక రత్నం జిల్లా కార్యాలయంలో సమావేశమై కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏఐసీసీ ఆదేశాల మేరకు తమ విధి నిర్వహణలో భాగంగా జిల్లా మొత్తం ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను పునరుత్తేజపరిచి పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి పరిశీలన జరుగుతోందని అందులో భాగంగా డిసిసి పదవికి అర్జీలు స్వీకరిస్తామని అందులోని బలమైన నాయకుడిని ఎన్నుకోవడం జరుగుతుంది అని తెలిపారు. కావున జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి అన్నమయ్య జిల్లా మదనపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్ దరఖాస్తు చేసుకోవడమైనది. ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా ముస్లిం మైనార్టీలు ఉన్నారు. వారు ఎక్కువ శాతం కాంగ్రెస్ వాదులు. ఆ కారణంగానే 2024 ఎన్నికలలో పార్లమెంటు అభ్యర్థి స్థానికుడు కాకపోయినా బాషీద్ అనే వ్యక్తి కి 53,300 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మైనార్టీల వలన వచ్చాయి. కాబట్టి మైనార్టీల ప్రాబల్యంఉన్న జిల్లాలో మైనారిటీ అయిన నాకు డీసీసీ అద్యుక్షుడుగా అవకాశం ఇస్తే జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అందరిని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేయమన్నా జిల్లా స్థాయిలో విజయవంతంగా నిర్వహిస్తాను. జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను కలుపుకొని జిల్లాలో క్షేత్రస్థాయి నుండి పార్టీని బలేపేతం చేయడానికి, రాబోవు రోజుల్లో రాహుల్ గాంధీ ని ప్రధాని మంత్రిని చేయడానికి శక్తివంచన లేకుండా నా వంతు కృషి చేస్తానంటూ అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, జిల్లా స్థాయి నాయకులు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ లు, అన్నమయ్య జిల్లా పీసీసీ కార్యవర్గం, రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకులు, మహిళా విభాగ నాయకులు, ఎస్ సి సెల్, బి సి సెల్, మైనారిటీ సెల్, సేవాదళ్, యువజన కాంగ్రెస్, ఎ న్ ఎస్ యు ఐ నాయకులు,ఐ ఎన్ సి సోషల్ మీడియా ( కోఆర్డినేటర్ ) నాయకులు మరియు కార్యకర్తలు అందరూ నా అభ్యర్తిత్వాన్ని బలపరుస్తారని కోరుతున్న రెడ్డి Almost

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: